'సైరా' : ఉయ్యాలవాడ కుటుంబ సభ్యుల ఆందోళన, అరెస్ట్
స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్పై రామ్చరణ్ ఈ చిత్రాన్ని నిర్మస్తున్నారు.
స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి`. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్పై రామ్చరణ్ ఈ చిత్రాన్ని నిర్మస్తున్నారు. షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ కు దగ్గర పడటంతో ప్రస్తుతం హడావిడిగా పోస్ట్ ప్రొడక్షన్కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ జూబ్లీహిల్స్లోని చిరంజీవి కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.
`సైరా నరసింహారెడ్డి` సినిమా తీసే సమయంలో సినిమాకు అవసరమైన పూర్తి సమాచారంతో పాటు షూటింగ్కి అనువైన లొకేషన్స్, నరసింహారెడ్డి జీవితం గురించి తమ నుండి పూర్తి సమాచారం తెలుసుకున్నారని, ఆ సమయంలో చిరంజీవి తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారని, కానీ ఇప్పుడు న్యాయం చేయడం లేదదంటూ వారు ఆరోపించారు. ఆందోళన జరగుతుందని సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు.
గతంలో ఇదే విషయమై కొణెదల ప్రొడక్షన్స్ కు చెందిన వారు మాట్లాడుతూ..వంద ఏళ్లు దాటిన తర్వాత.. ఎవరైనా చరిత్రకారుడుకి సంబంధించిన సినిమాను తెరకెక్కించవచ్చు. ఇందులో ఎలాంటి సమస్యలు ఉండవు. గతంలో బయోపిక్ తీసిన ఎవరికీ ఇలాంటి ఇబ్బంది ఎదురవలేదు. `సైరా నరసింహారెడ్డి` చిత్రీకరణకు ముందు ఉయ్యాలవాడ నరసింహరావు కుటుంబ సభ్యులతో మేం చర్చలు జరిపాం అన్నారు.