ఆమె 'మాస్క్' రేటు...కరోనాకే కంగారు పుడుతుంది
బాలీవుడ్ ప్రేక్షకుల్లో ఓ రేంజిలో క్రేజ్ ని సంపాదించుకున్న తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈ సారి మాస్క్ గురించిన విషయంలో కాబట్టి మరింత ఇంట్రస్ట్ కలిగింది జనాలకి.
బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ ఊర్వశి రౌతెలా ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్ తో మీడియాని తనవైపు లాక్కునేలా చేస్తుంది. హాట్ హాట్ అందాలతో పాటు హాట్ హాట్ హెడ్ లైన్స్ లోనూ మారు మ్రోగుతూంటుంది. బాలీవుడ్ ప్రేక్షకుల్లో ఓ రేంజిలో క్రేజ్ ని సంపాదించుకున్న తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈ సారి మాస్క్ గురించిన విషయంలో కాబట్టి మరింత ఇంట్రస్ట్ కలిగింది జనాలకి.
ఈ కోవిడ్ టైమ్ లో మాస్క్లు కంపల్సరీ అయ్యాయి. ఎవరి రేంజ్కు తగ్గట్టుగా వారు మాస్క్లు మొహాలకి తగిలిస్తున్నారు. అయితే ఊర్వశి మాత్రం మాస్క్ విషయంలో మరో లెవల్ ని రీచ్ అయ్యింది. ఏకంగా డైమండ్స్తో రెడీ చేసిన ఫేస్ మాస్క్ను పెట్టుకొని కెమెరాకు ఫోజులిచ్చింది. ఆ మాస్క్ ఖరీదు ఎంతో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. ఏకంగా రూ. 3 కోట్ల రూపాయలని బాలీవుడ్ మీడియా అంటోంది. ఈ బోల్డ్ బ్యూటీ డైమండ్ మాస్క్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
తాజాగా ఈ భామ.. తెలుగులో సంపత్ నంది నిర్మాణంలో తెరకెక్కుతోన్న ‘బ్లాక్ రోజ్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. హీరోయిన్గా పెద్దగా ఫాంలో లేకపోయినా గ్లామర్ ఫీల్డ్ ను ఏలేస్తున్న ఊర్వశీ రౌతెలా మోడలింగ్లో దూసుకుపోతోంది. సినిమాల్లోనూ గ్లామర్ డోస్ కాస్త ఎక్కువగానే చూపిస్తూడే ఆమె తనకు తగిన గుర్తింపు రాలేదని ఎప్పుడూ బాధపడిపోతూంటుంది. అంతకు మించి ఫోటో షూట్లతో న్యూస్లో కనిపిస్తుంటారు క్రేజీ స్టార్. ఇక ఎప్పుడూ వార్తల్లో నానుతుండటం కూడా ఈ బోల్డ్ బ్యూటీకి అలవాటే.
గతంలోనూ ఊర్వశీ రౌతెలా బ్లాక్ వాటర్ను తాగి వార్తల్లోకి ఎక్కింది. ఒక లీటర్ వాటర్ బాటిల్ ధర సుమారు మూడు నుంచి నాలుగు వేరు. సహజసిద్ధమైన బ్లాక్ ఆల్కలీన్ వాటర్ శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచడానికి సహాయపడుతుంది. బ్లాక్ వాటర్లో పీహెచ్ ఎక్కువగా ఉంటుంది. కరోనా నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు బ్లాక్ వాటర్ తాగేందుకు ఆసక్తిచూపించారు. రోగనిరోధక శక్తిని మెరుగుపర్చడానికి, ఆరోగ్యంగా ఉండటానికి ‘బ్లాక్ వాటర్’కు మారామని వాళ్లు చెబుతున్నారు.