Asianet News TeluguAsianet News Telugu

గుడ్ న్యూస్.. SSMB28 టైటిల్ ఫైనల్ అయ్యింది.. ఆరోజే అనౌన్స్ మెంట్.. అఫీషియల్ అప్డేట్

మహేశ్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న SSMB28 టైటిల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఆ ప్రత్యేకమైన రోజు రివీల్ చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. 
 

Update on SSMB28 Title Announcement form makers  NSK
Author
First Published May 26, 2023, 5:00 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మూడోసారి ఓ భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. SSMB28 వర్క్ టైటిల్ తో సినిమా షూటింగ్ ను శరవేగంగా కొనసాగిస్తున్నారు. ఇటీవల కాలంలో ముందుగా టైటిళ్లను రివీల్ చేయడం లేదు. స్టార్ హీరోల సినిమాల విషయంలో ఆసక్తిని పెంచేందుకు కొద్దిరోజులు వర్క్ టైటిల్ తోనే నడిపిస్తున్నారు. 

ఈ క్రమంలో తమ అభిమాన హీరోల సినిమా టైటిల్ ఏమై ఉంటుందనే ఆసక్తి ఫ్యాన్స్ లో రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ చిత్రాల టైటిల్స్ విడుదలైన విషయం తెలిసిందే. ఇక తాజాగా ‘ఎస్ఎస్ఎంబీ28’ చిత్ర టైటిల్ ను కూడా రిలీజ్ చేసేందుకు యూనిట్ సిద్ధం అయ్యింది. తాజాగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా అందించారు. 

దివంతగత, సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే31న SSMB28 వర్క్ టైటిల్ ను విడుదల చేయబోతున్నట్టు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఫ్యాన్స్ ద్వారా థియేటర్లలో మునుపెన్నడూ లేనివిధంగా టైటిల్ ను రివీల్ చేయబోతున్నట్టు ఆసక్తి పెంచారు. మున్ముందు మరిన్ని అప్డేట్ అందించనున్నారని తెలిపారు. దీంతో ఫ్యాన్స్  ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక అదే రోజు కృష్ణ నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ రీరిలీజ్ కూడా ఉండటం విశేషం. 

ఇదిలా ఉంటే... చిత్ర టైటిల్ ఇదేనంటూ ప్రచారం జరిగింది. మొదట‘అర్జునుడు’గా, తర్వాత ‘అయోధ్యలో అర్జునుడు’గా, ప్రస్తుతం ‘అమరావతికి అటు ఇటు’ అనే టైటిల్ వినిపిస్తోంది. వీటిలో ఏది రానుందో చూడాలి. ఇంకేదైనా టైటిల్ తో వస్తారన్నది కూడా ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. పూజా హెగ్దే, శ్రీలీలా హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. 2024 జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios