Upasana: ఉపాసనకి కరోనా పాజిటివ్.. షాకిచ్చిన రామ్చరణ్ వైఫ్.. ఏమైందంటే?
మెగా అభిమానులకు పెద్ద షాకిచ్చింది ఉపాసన కొణిదెల. తాను కరోనా బారిన పడినట్టు వెల్లడించింది. తాజాగా సోషల్ మీడియా ద్వారా ఆమె ఈ విషయాన్ని పంచుకుంది.
కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందని అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. రెగ్యూలర్ జీవనం సాగుతుంది. ఈ క్రమంలో తాజాగా రామ్చరణ్ భార్య, ఉపాసన పెద్ద షాకిచ్చింది. తనకు కరోనా సోకినట్టు వెల్లడించింది. గత వారం తాను కోవిడ్ బారిన పడినట్టు చెప్పింది ఉపాసన. ప్రస్తుతం కోలుకుందట. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తగా ఉండాలని తెలిపింది ఉపాసన.
ఇందులో ఉపాసన చెబుతూ, చెన్నైలోని తన గ్రాండ్ పెరెంట్స్ను కలిసేందుకు కోవిడ్ టెస్ట్ చేసుకున్నానని, ఈ పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. దీంతో వారం రోజులుగా వైద్యుల సూచనతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నట్లు ఆమె చెప్పారు. `గత వారం కోవిడ్ పాజిటివ్గా పరీక్షించాను. ముందే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయి. దీంతో డాక్టర్స్ నన్ను కేవలం పారాసిటమల్, విటమిన్ టాబ్లెట్స్ మాత్రమే వాడమని సూచించారు. ఈ మహమ్మారి సోకండంతో చాలా మంది నాకు నీరసించిపోవడం, హేల్ లాస్ అవ్వడం, బాడీ పెయిన్స్ వంటి సమస్యలు రావోచ్చని చెప్పారు.
కానీ ఇప్పుడు ఆ సమస్యలు ఏం నాలో కనిపంచడం లేదు. ఎందుకంటే నాకు నేను మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నాను. అందుకే నాకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. మళ్లీ వైరస్ విజృంభిస్తుందా? అంటే చెప్పలేను. కానీ, మనం కచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే. చెన్నైలోని తాతయ్య-అమ్మమ్మలను కలిసేందుకు కోవిడ్ పరీక్షలు చేసుకోవడం వల్ల వైరస్ బయటపడింది. లేదంటే అసలు బయటపడేది కాదు` అని పేర్కొంది ఉపాసన.
విషయం తెలిసిన అభిమానులు ఆందోళన చెందినా, ఆమె కోలుకున్నారనే విషయంతో రిలాక్స్ అవుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో చిరంజీవి, రామ్చరణ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఉపాసన అపోలో ఆసుపత్రులు, ఫార్మసీ నిర్వహకురాలిగా ఉన్నారు. మరోవైపు సామాజిక కార్యకర్తగానూ వ్యవహరిస్తున్నారు. కేవలం వ్యాపారాలే కాదు, సామాజిక కార్యకలాపాల్లోనూ పాల్గొంటూ మల్టీటాలెంటెడ్గా రాణిస్తున్నారు.