Asianet News TeluguAsianet News Telugu

యూఎస్ బుకింగ్స్ లో బాలయ్య జోరు... దుమ్మురేపుతున్న వీరసింహారెడ్డి!

ట్రైలర్ విడుదల కాకుండానే ప్రీమియర్ వసూళ్లులో వీరసింహారెడ్డి  దుమ్మురేపుతోంది. అఖండ విడుదలకు ఐదు రోజుల ముందు లక్ష డాలర్ల మార్క్ చేరుకుంది. వీరసింహారెడ్డి రెండు వారాల ముందే ఆ ఫీట్ సాధించింది. 

u s advance bookings veerasimhareddy crosses one lack dollars
Author
First Published Jan 3, 2023, 4:20 PM IST


యూఎస్ లో బాలకృష్ణ జోరు చూపిస్తున్నారు. ప్రీ బుకింగ్స్ లో వాల్తేరు వీరయ్యపై వీరసింహారెడ్డిదే పై చేయి అవుతుంది. విడుదలకు 11 రోజుల ముందే వీరసింహారెడ్డి లక్ష డాలర్ల మార్క్ చేరుకుంది.  వీరసింహారెడ్డి యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. అఖండ మూవీకి మించిన క్రేజ్ వీరసింహారెడ్డికి దక్కింది. ట్రైలర్ విడుదల కాకుండానే ప్రీమియర్ వసూళ్లులో మూవీ దుమ్మురేపుతోంది. అఖండ విడుదలకు ఐదు రోజుల ముందు లక్ష డాలర్ల మార్క్ చేరుకుంది. వీరసింహారెడ్డి రెండు వారాల ముందే ఆ ఫీట్ సాధించింది. 

జనవరి 11న వీరసింహారెడ్డి ప్రీమియర్స్ పడనున్నాయి. సాధారణంగా మాస్ చిత్రాలకు యూఎస్ ఆడియన్స్ అంతగా కనెక్ట్ కారు. అయితే సంక్రాంతి సీజన్ కావడంతో మెరుగైన వసూళ్లు నమోదవుతున్నాయి. అమెరికాలో ఉన్న తెలుగువారు సంక్రాంతి పండుగ వేళ థియేటర్స్ కి క్యూ కడతారు. 

గత రెండు సంక్రాంతులు చప్పగా సాగాయి. కరోనా సంక్షోభంలో కలిసి పోయాయి. 2020 తర్వాత మళ్ళీ పెద్ద చిత్రాలు సంక్రాంతి బరిలో నిలుస్తున్నాయి. మొత్తంగా టాలీవుడ్ స్టార్ బాలయ్య-చిరంజీవి, కోలీవుడ్ స్టార్స్ విజయ్-అజిత్ సంక్రాంతి బరిలో పోటీపడుతున్నారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు, తెగింపు విడుదలవుతున్నాయి. 

థియేటర్స్ పంపకం విషయంలో సందిగ్ధత నెలకొన్న తరుణంలోవారసుడు చిత్రానికి అధిక స్క్రీన్స్ దక్కినట్లు తెలుస్తుంది. వైజాగ్ సిటీలో 8 స్క్రీన్స్ వారసుడు చిత్రానికి 5 వాల్తేరు వీరయ్య, 4 వీరసింహారెడ్డి చిత్రాలకు దక్కాయి. ముందు నుండి ప్రచారం జరుగుతున్నట్లే యాభై శాతం థియేటర్స్ వారసుడు చిత్రానికి దక్కాయి. అధిక డిమాండ్ ఉన్న చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలను కాదని వారసుడు చిత్రానికి అధిక థియేటర్స్ కేటాయించడం సంచలనంగా మారింది. ఎవరు ఏమనుకున్నా.... దిల్ రాజు తన పంతం నెగ్గించుకున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios