Asianet News TeluguAsianet News Telugu

దేవిశ్రీ ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదాలు.. గంటల వ్యవధిలోనే, శత్రువుకి కూడా ఇలాంటి కష్టం వద్దు

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఇంట రెండు తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.

two tragic incidents happened in Music director Devi Sri prasad family
Author
Hyderabad, First Published Sep 17, 2021, 4:27 PM IST

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఇంట రెండు తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం దేవిశ్రీ కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.  శత్రువుకి కూడా ఇలాంటి కష్టం వద్దు 

దేవీశ్రీ ప్రసాద్ బాబాయ్ బుల్గానిన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. ఈ విషాదకర వార్తతో దేవీశ్రీ ఫ్యామిలీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. కానీ ఊహించని విధంగా దేవిశ్రీ ఫ్యామిలీకి మరో పిడుగులాంటి వార్త ఎదురైంది. 

బుల్గానిన్ మరణవార్త విన్న దేవిశ్రీ మేనత్త సీతామహాలక్ష్మీ గుండెపోటుకు గురై మరణించారు. దీనితో దేవిశ్రీ ప్రసాద్ కుటుంబం తీవ్ర మానసిక వేదన అనుభవిస్తోంది. ఇలాంటి కష్టం శత్రువుకి కూడా కలుగకూడదు అనిపించేలా గంటల వ్యవధిలోనే ఈ విషాదాలు చోటు చేసుకున్నాయి. ఇంతటి బాధని అధికమించేలా దేవిశ్రీ ప్రసాద్ కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యం ఇవ్వాలని స్నేహితులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. 

దేవిశ్రీ ప్రసాద్ స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లాలోని వెదురుపాక. శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం వారిది. దేవిశ్రీ తాతగారు నారాయణ కమ్యూనిస్ట్ గా, ఆర్ ఎంపీ డాక్టర్ గా పనిచేశారు. ఆయనకు దేవీశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి తో పాటు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కుమారులు సంతానం. ప్రస్తుతం దేవీశ్రీ ప్రసాద్ అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios