Asianet News TeluguAsianet News Telugu

హీరో కూతురు సినిమా ఆగిపోయింది!

జీవితా రాజశేఖర్ ల కుమార్తె శివానీ రాజశేఖర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలనుకుంది. చాలా ప్రాజెక్ట్ ల తరువాత అడివి శేష్ హీరోగా 'టూ స్టేట్స్' రీమేక్ లో నటించడానికి నిర్ణయించుకున్నారు. 

two states remake movie shelved..?
Author
Hyderabad, First Published Apr 6, 2019, 9:43 AM IST

జీవితా రాజశేఖర్ ల కుమార్తె శివానీ రాజశేఖర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలనుకుంది. చాలా ప్రాజెక్ట్ ల తరువాత అడివి శేష్ హీరోగా 'టూ స్టేట్స్' రీమేక్ లో నటించడానికి నిర్ణయించుకున్నారు.

కానీ ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది. సినిమా నిర్మాణం సగం పూర్తయిన తరువాత దర్శకుడి పనితనం నచ్చక ప్రాజెక్ట్ ని మధ్యలోనే  ఆపేసినట్లు సమాచారం. దీంతో అడివి శేష్ మరో సినిమా సెట్స్ పైకి వెళ్లిపోయారు.

తన తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టాడు. ఈ రీమేక్ ని ఎంతో ఆసక్తిగా మొదలుపెట్టిన నిర్మాత సత్యనారాయణకి దర్శకుడు వెంకట్ పెద్ద షాక్ ఇచ్చాడట. ఇటీవల ఓ పెద్ద షెడ్యూల్ చేస్తే కనీసం ఔట్ పుట్ రాబట్టలేకపోయాడట.

దీంతో ప్రాజెక్ట్ ఆపేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు కొత్త దర్శకుడితో సినిమాను పూర్తి చేయాలా..? లేక ప్రాజెక్ట్ వదిలేయాలా..? అనే విషయంలో ఓ నిర్ణయానికి  రాలేకపోతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios