దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా చాలా కాలంగా వివాదాల్లో చిక్కుకుంది. రిలీజ్‌పై మేకర్స్‌కి కూడా క్లారిటీ లేదు. ఇలాంటి టైంలో సినిమాకు సంబంధించి ఒక సూపర్ అప్‌డేట్ బయటకు వచ్చింది. 

రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టే ముందు విజయ్ నటిస్తున్న చివరి సినిమా 'జన నాయగన్'. ఈ సినిమా కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ కొన్ని వివాదాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్‌పై ఒక కొత్త అప్‌డేట్ వచ్చింది. ఈ తాజా సమాచారంతో అభిమానుల ఎదురుచూపులకు తెరపడనున్నట్టే కనిపిస్తోంది. ఈ సినిమాకు హెచ్. వినోద్ డైరెక్టర్. ఇది ఒక పవర్-ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.

'జన నాయగన్' రిలీజ్ అప్‌డేట్

రిపోర్ట్స్ ప్రకారం, దళపతి విజయ్ 'జన నాయగన్' సినిమాను మొదట అక్టోబర్ 2025లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ప్రొడక్షన్ పనులు పూర్తికావడానికి టైం పట్టడంతో, ఈ ఏడాది జనవరి 9న రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. అయితే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి ఇంకా క్లియరెన్స్ రాకపోవడంతో ఆ తేదీకి కూడా సినిమా విడుదల కాలేదు. ప్రస్తుతం సర్టిఫికేషన్ ప్రాసెస్ పూర్తయ్యాకే మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. 'జన నాయగన్', 'టాక్సిక్' రెండు సినిమాలను కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థే నిర్మిస్తోంది. 

రిలీజ్ కు రెడీగా టాక్సిక్.. 

ఈ బ్యానర్‌లో 'కేడీ: ది డెవిల్' ఏప్రిల్ 30న, 'టాక్సిక్' జూన్ 4న రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'జన నాయగన్' రిలీజ్‌ను జూన్ లేదా జూలైకి వాయిదా వేయొచ్చని టాక్. విజయ్ 52వ పుట్టినరోజు (జూన్ 22) సందర్భంగా సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే, థియేటర్ రిలీజ్ పదేపదే ఆలస్యం అవ్వడం వల్ల సినిమా ఓటీటీ డీల్‌పై ఎఫెక్ట్ పడింది. 'వళై పేచు' రిపోర్ట్ ప్రకారం, ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ డీల్ క్యాన్సిల్ అయిందట. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ డిజిటల్ హక్కులను రూ.121 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ డీల్ రద్దు కావడంతో మేకర్స్‌కు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.

'జన నాయగన్' సినిమా గురించి

హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెట్రి కొండన్ అనే మాజీ పోలీస్ ఆఫీసర్ కథను చూపిస్తారు. అతను తర్వాత క్రిమినల్‌గా మారతాడు. విజి అనే ఒక చిన్న అమ్మాయిని దత్తత తీసుకుని, ఆమెను ధైర్యంగా, స్వతంత్రంగా పెంచుతాడు. ఆమెకు భయాలు ఉన్నప్పటికీ, ఆర్మీలో చేరడానికిి ప్రోత్సహిస్తాడు. ఈ సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి'కి రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. విజయ్ కాకుండా ఈ సినిమాలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.300 కోట్లు.