తెలుగు టీవీ నటుల్లో కలవరం.. మరో ఇద్దరికి పాజిటివ్
మహమ్మారి కరోనా బుల్లితెర నటులపై తన పంజా విసురుతోంది. ఇప్పటికే పలువురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా.. తాజాగా మరో ఇద్దరు నటులు ప్రాణాంతక వైరస్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బిగ్బాస్3తో పాపులర్ అయిన రవికృష్ణ కరోనా బారిన పడ్డారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా తనకి కరోనా సోకిందని తెలిపారు రవికృష్ణ.
మహమ్మారి కరోనా బుల్లితెర నటులపై తన పంజా విసురుతోంది. ఇప్పటికే పలువురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా.. తాజాగా మరో ఇద్దరు నటులు ప్రాణాంతక వైరస్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బిగ్బాస్3తో పాపులర్ అయిన రవికృష్ణ కరోనా బారిన పడ్డారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా తనకి కరోనా సోకిందని తెలిపారు రవికృష్ణ.
ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నట్టు తెలిపిన రవికృష్ణ గత మూడు రోజులుగా ఎలాంటి లక్షణాలు లేవని స్పష్టం చేశాడు. తనతో కలిసి పని చేసిన వారిని పరీక్షించి ఆ తర్వాత ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందించాలని అభ్యర్ధించాడు రవికృష్ణ. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న ఈ సమయంలో ఎవరు బయటకి రావొద్దని కోరుతున్నాడు. రవికృష్ణ ప్రస్తుతం పలు సీరియల్స్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా బిగ్బాస్3తో పాపులర్ అయిన రవికృష్ణ కరోనా బారిన పడ్డారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా తనకి కరోనా సోకిందని తెలిపారు రవికృష్ణ.
ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నట్టు తెలిపిన రవికృష్ణ గత మూడు రోజులుగా ఎలాంటి లక్షణాలు లేవని స్పష్టం చేశాడు. తనతో కలిసి పని చేసిన వారిని పరీక్షించి ఆ తర్వాత ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందించాలని అభ్యర్ధించాడు రవికృష్ణ. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న ఈ సమయంలో ఎవరు బయటకి రావొద్దని కోరుతున్నాడు. రవికృష్ణ ప్రస్తుతం పలు సీరియల్స్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
అలాగే టీవీ నటుడు సాక్షి శివకు కరోనా సోకినట్లు సమాచారం. వివిధ చానెళ్లలో ప్రసారమవుతున్న అక్క మొగుడు, నెంబర్ 1 కోడలు, మౌనరాగం సీరియల్స్లో నటిస్తున్న శివకు కోవిడ్ పాజిటివ్గా తేలడంతో మరోసారి టీవీ పరిశ్రమలో కలకలం రేగింది. వరుసగా పలువురికి కరోనా సోకుతుండటంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నా.. కేసులు పెరుగుతున్నాయని వాపోతున్నారు.
కాగా ఇప్పటికే ఇద్దరు నటులు సహా ప్రముఖ చానెల్లో ప్రసారమవుతున్న ఆమె కథ సీరియల్ హీరోయిన్ నవ్య స్వామి కరోనా బారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన నవ్య.. తాను ధైర్యంగా మహమ్మారితో పోరాడతానని, ఎవరూ ఆందోళన చెందవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.