Asianet News TeluguAsianet News Telugu

"లేడీ పవన్ కళ్యాణ్" అని నన్ను ఆయన పిలిచారు

మీరు ఆ సినిమాలో ఓ పాత్ర చేయాలని అడిగారు. లేడీ పవన్ కల్యాణ్‌ వస్తుందని పవన్ కల్యాణ్‌కు చెప్పాను. మీ ఇద్దరి కాంబినేషన్ బాగుంటుందని చెప్పారు. అయితే షూటింగు సమయంలో అలాంటి ఫీలింగ్ కలిగింది. 

Trivikram Called Me Lady Pawan Kalyan
Author
Hyderabad, First Published Nov 27, 2021, 8:43 PM IST

తెలుగులో అతి తక్కువ సమయంలో ఓ రేంజిలో ఫాలోయింగ్ అందుకున్న ముద్దుగుమ్మ ఎవరూ అంటే నిత్య మీనన్.. అని చెప్పాలి. తన అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. సింగర్‏గానూ తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది. మళయాళం, తెలుగులోనే కాకుండా.. తమిళంలోనూ ఈమె ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అలా మొదలైంది సినిమాతో నిత్య టాప్ హీరోయిన్ రేసులో దూసుకుపోయినా ఆ మధ్యన కొద్ది గ్యాప్ తీసుకుంది.   ఇదిలా ఉంటే.. చాలా కాలం గ్యాప్ తర్వాత నిత్య తెలుగులో మళ్లీ వరుస ఆఫర్లు అందుకుంటుంది. 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న భీమ్లా నాయక్ సినిమాలో హీరోయిన్‏గా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ నెట్టింట్లో రికార్డ్స్ సృష్టించాయి. ఇక  త్వరలో విడుదల కానున్న ‘స్కైలాబ్’ సినిమాలో ఆమె కీ రోల్ చేస్తోంది. ఈ సినిమాకి ఆమె సహ నిర్మాత కూడా. ఈ సినిమాలో ఆమె తెలంగాణ యాసలోనే మొత్తం డైలాగులు చెప్పడం విశేషం. సత్యదేవ్, నిత్య మీనన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ మూవీ వచ్చే నెల 4న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఆమె మీడియాతో మాట్లాడింది.అందులో ప్రధానంగా భీమ్లా నాయక్ టాపిక్ వచ్చింది.

నిత్యా మీనన్ మాట్లాడుతూ...అయ్యప్పనుమ్ కోషియం సినిమా రీమేక్ చేస్తున్నామని త్రివిక్రమ్ శ్రీనివాస్ కాల్ చేసి పవన్ కల్యాణ్‌తో సినిమా చేస్తున్నామని చెప్పారు. మీరు ఆ సినిమాలో ఓ పాత్ర చేయాలని అడిగారు. లేడీ పవన్ కల్యాణ్‌ వస్తుందని పవన్ కల్యాణ్‌కు చెప్పాను. మీ ఇద్దరి కాంబినేషన్ బాగుంటుందని చెప్పారు. అయితే షూటింగు సమయంలో అలాంటి ఫీలింగ్ కలిగింది. పవన్ కల్యాణ్ చాలా మౌనంగా ఉంటారు. ఎక్కువగా మాట్లాడరు అని నిత్యా మీనన్ చెప్పారు. నేను స్పాంటేనియస్ యాక్టర్‌ని, నా స్వభావానికి తగినట్టుగా భీమ్లా నాయక్ పాత్ర ఉంది. ఆ పాత్ర చాలా మంచిగా అనిపించింది. భీమ్లా నాయక్ సినిమాలో నా రోల్‌కు సంబంధించిన షూట్ పూర్తి కాలేదు. ఇంకా ఒక పాట మిగిలి ఉంది. భీమ్లా నాయక్‌ సినిమాలో నటించడం మంచి ఎక్సీపీరియన్స్ అని నిత్యా మీనన్ తెలిపారు.
 
స్కైలాబ్ చిత్రం గురించి మాట్లాడుతూ... “తెలంగాణలోని ఒక చిన్న గ్రామంలో జరిగే కథ. బండలింగం పల్లి అనే విలేజ్‌లో జరుగుతుంది సబ్జెక్ట్. పీరియడ్ మూవీ కానీ కలర్ ఫుల్ గా ఉంటుంది,” అని చెప్తోంది నిత్య. “అవును తెలంగాణ యాసలో మాట్లాడా. అదీ సింక్‌ సౌండ్‌లో చేశా. అంటే… డబ్బింగ్ లో కాదు. సెట్ లోనే డైలాగులు చెప్పా. ఒక్క వర్డ్ కూడా తప్పు చెప్పలేదన్నారు. యాస కోసం శిక్షణ ఏమి తీసుకోలేదు కానీ ఎక్కువగా తెలంగాణ యాక్సెంట్ లో మాట్లాడే వారి దగ్గర కూర్చొని వారి మాటలు వింటూ నేర్చుకున్నా. నాకు తెలంగాణ యాక్సెంట్‌ పై చాలా ఇష్టం ఏర్పడిందిప్పుడు. తెలంగాణ విలేజెస్‌ చాలా బ్యూటీఫుల్‌గా ఉంటాయి. సినిమా సెట్ తో పాటు హైదరాబాద్‌ పరిసరాల్లోనే మొత్తం షూటింగ్ పూర్తి చేశాం,” అని అంటోంది నిత్య మీనన్.

Follow Us:
Download App:
  • android
  • ios