చిరు సినిమాకి అప్పుడు హ్యాండిచ్చి.. ఇప్పుడు ఓకే చెప్పిన త్రిష..?
చిరంజీవి హీరోగా `లూసిఫర్` రీమేక్ని తమిళ దర్శకుడు మోహన్రాజా రూపొందిస్తున్నారు. ఇది ఇటీవల ప్రారంభమైంది. ఈ చిత్రంలో హీరోయిన్ ఉండదు. ఈ లెక్కన చిరంజీవి సరసన హీరోయిన్ లేదనే చెప్పాలి. కానీ చెల్లి పాత్ర చాలా బలంగా, కీలకంగా ఉంటుంది.
చిరంజీవి నటిస్తున్న `ఆచార్య` చిత్రంలో హీరోయిన్గా ముందుగా త్రిషని ఫైనల్ చేశారు. దాదాపు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. కానీ ఏం జరిగిందో ఏమో ఆ తర్వాత సినిమా నుంచి తప్పుకుంది త్రిష. అయితే తాజాగా ఆమె ఓకే చెప్పిందట. `లూసిఫర్` రీమేక్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. చిరంజీవి హీరోగా `లూసిఫర్` రీమేక్ని తమిళ దర్శకుడు మోహన్రాజా రూపొందిస్తున్నారు. ఇది ఇటీవల ప్రారంభమైంది.
ఈ చిత్రంలో హీరోయిన్ ఉండదు. ఈ లెక్కన చిరంజీవి సరసన హీరోయిన్ లేదనే చెప్పాలి. కానీ చెల్లి పాత్ర చాలా బలంగా, కీలకంగా ఉంటుంది. చెల్లి పాత్రలో నటించేందుకు త్రిష ఓకే చెప్పిందనే వార్త ఇప్పుడు అన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అయితే ఈ చిత్రంలో ముందుగా చెల్లి పాత్రకి విజయశాంతిని అడిగారు. చిరంజీవితో ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించి డ్యూయెట్లు పాడిన విజయశాంతి, చిరుకి చెల్లిగా నటించేందుకు నో చెప్పేసిందట.
దీంతో నయనతారని సంప్రదించారు. ఇప్పటికే `సైరా`లో చిరంజీవి సరసన నటించింది నయనతార. ఆమె కూడా చిరంజీవికి చెల్లిగా నటించేందుకు ఒప్పుకోలేదట. దీంతో చివరికి త్రిషని సంప్రదించగా,చిరంజీవికి చెల్లిగా నటించేందుకు అంగీకరించిందని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే `స్టాలిన్` చిత్రంలో చిరు సరసన త్రిష ఆడిపాడిన విషయం తెలిసిందే. త్రిష ప్రస్తుతం `పరమపదమ్ విలయట్టు`,`గర్జనై`, `సథురంగ వెట్టై 2`, `రాంగి`, `సుగర్`, `రామ్`, `పొన్నియిన్ సెల్వన్` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.