Jr NTR : ఎన్టీఆర్ కు మటన్ బిర్యానీ పంపించిన టాలీవుడ్ యంగ్ హీరో..
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కు మటన్ బిర్యానీ అంటే ఇష్టం. ఆ విషయం చాలామందికి తెలిసిందే.. అయితే తారక్ అంటే ఎంతో ఇష్టపడే టాలీవుడ్ యంగ్ హీరో ఒకరు ఎన్టీఆర్ ఇంటికి మటన్ బిర్యానీ పంపించారట. ఇంతకీ ఎవరా హీరో.
![Tollywood Young Hero Naga Shourya Send Mutton Biryani To Jr NTR JMS Tollywood Young Hero Naga Shourya Send Mutton Biryani To Jr NTR JMS](https://static-ai.asianetnews.com/images/01hgb0d6jdfrg4dj1kc5xfnz1r/2-jpg_363x203xt.jpg)
ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిపోయారు ఎన్టీఆర్. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. ఇక ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు ఈ విషయం తెలిసిందే.. ఎన్టీఆర్ మంచి ఫుడ్డీ కూడా. ఆయనకు ఇష్టమైన వంటలు.. కడుపునిండా తింటారు. ఎటువంటి రిస్టిక్షన్స్ లేకుండా తినేస్తారట. అచ్చంగా వారి తాత సీనియర్ ఎన్టీఆర్ లాగే ఇష్టమూన ఫుడ్ వదలరట. అయితే తారక్ వదలకుండా తినే వాటిలో మటన్ బిర్యాని ఒకటి. బావార్చీ నుంచి మటన్ బిర్యాని ఫ్యామిలీ ప్యాక్ తెప్పించి.. ఒక్కడే తినేస్తారట తారక్. ఈ విషయం ఓ సందర్భంలో ఆయనే చెప్పారు. ఇక తారక్ కు మటన్ బిర్యాని అంటే ఎంత ఇష్టమో. ఈవిషయంతో తెలిసిపోతోంది.
ఇక ఈక్రమంలో ఎన్టీఆర్ కోసం టాలీవుడ్ హీరో నాగశౌర్య మంచి మటన్ బిర్యానీ పార్సిల్ పంపించారట. అవును ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యస్ ప్రకారం. ఎన్టీఆర్ కోసం నాగశౌర్య ఫ్యామిలీ నుంచి మంచి మటన్ బిర్యాని పార్సిల్ వెళ్ళినట్టుతెలుస్తోంది. ఎన్టీఆర్ అంటే నాగశౌర్యకు చాలా ఇష్టం. తారక్ కు శౌర్య పెద్ద ఫ్యాన్. ఈ విషయం పలు సందర్భాల్లో వెల్లడించాడు కూడా. అయితే నాగశౌర్య టాలీవుడ్ లో యంగ్ హీరోగా కొనసాగుతున్న విషయం కూడా తెలిసిందే. ఆయన తల్లి ఉషా మూల్పూడి నిర్మాతగా కొనసాగుతున్నారు. ఆమె పలు సినిమాలు కూడా నిర్మించారు.
అయితే ఆమె ఉష ముల్పూరీస్ కిచెన్ పేరుతో ఒక రెస్టారెంట్ ను మొదలుపెట్టగా ఆ రెస్టారెంట్ లో పలువరు సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. ఇక ఈ రెస్టారెంట్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు మటన్ బిర్యానీ అందింది. నాగశౌర్య తల్లి ఉష ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. వైరల్లీ ఫుడ్ ఇంటర్వ్యూ తర్వాత తమ బిజినెస్ బాగా పెరిగిందని ఆమె అన్నారు.
పలువురు సెలబ్రిటీలు రెస్టారెంట్ కు వస్తున్నారని జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి మటన్ బిర్యానీ పార్సిల్ వెళ్లిందని ఆమె తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ డ్రైవర్ మటన్ బిర్యానీని కలెక్ట్ చేసుకున్నారని ఉష వెల్లడించారు. ఎన్టీఆర్ ఆర్డర్ చేయడంతో ఈ యంగ్ హీరో రెస్టారెంట్ నుంచి బిర్యానీ వెళ్లిందట.ఇక ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియ మూవీగా తెరకెక్కుతోన్న ఈసినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ తో తారక్ మూవీ సెట్స్ పైకి వెళ్లబోతోంది.