Asianet News TeluguAsianet News Telugu

సీతారామం దర్శకుడిని లాక్ చేసిన టాప్ ప్రొడ్యూసర్స్... అడ్వాన్స్ కూడా ఇచ్చేశారట!


టాలెంటెడ్ డైరెక్టర్స్ తో డీల్ సెట్ చేసుకోవడం మైత్రి మూవీ మేకర్స్ కి అలవాటు. యంగ్ డైరెక్టర్స్ కి అవకాశాలు ఇస్తూ సూపర్ హిట్స్ అందుకున్న సంస్థగా దానికి పేరుంది. తాజాగా హను రాఘవపూడిని మైత్రి మూవీ మేకర్స్ లైన్ లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. 
 

tollywood top production house locks sitaramam director hanu raghavapudi
Author
First Published Aug 9, 2022, 3:54 PM IST

శ్రీమంతుడు మూవీతో నిర్మాతలుగా పరిశ్రమలో అడుగుపెట్టిన మైత్రి మూవీ మేకర్స్ అద్భుతమైన విజయాలు అందుకున్నారు. జనతా గ్యారేజ్, రంగస్థలం, ఉప్పెన, పుష్ప, సర్కారు వారి పాట వంటి బ్లాక్ బస్టర్స్ ఈ బ్యానర్ లో తెరకెక్కాయి. అలాగే మరి కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ నిర్మాణ దశలో ఉన్నాయి. క్రాక్ తో మాస్ దర్శకుడిగా పేరుగాంచిన గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య తో ఓ మూవీ చేస్తున్నారు. ఇక పుష్ప మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకున్న మైత్రి మేకర్స్ పుష్ప 2 దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్ తో భారీగా నిర్మించనున్నారు. 

అలాగే చిరంజీవి-బాబీ దర్శకత్వంలో మెగా 154 మూవీ నిర్మాతలుగా కూడా ఉన్నారు. కాగా సీతారామం మూవీతో తానేమిటో నిరూపించుకున్న హను రాఘవపూడితో మూవీ ఫిక్స్ చేశారట. ఆయనకు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్నారట. స్వప్న సినిమాస్ బ్యానర్ లో తెరకెక్కిన సీతారామం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీగా దీన్ని అభివర్ణిస్తున్నారు. హను రాఘవపూడి టేకింగ్, స్క్రీన్ ప్లే, క్యారెక్టరైజేషన్ అందరినీ మెప్పించాయి. కమర్షియల్ గా కూడా సీతారామం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. 

ఈ క్రమంలో హను రాఘవపూడి కోసం నిర్మాతలు పోటీ పడుతున్నారు. దీంతో మైత్రి మేకర్స్ తన బ్యానర్ లో మూవీ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారట. స్క్రిప్ట్ సిద్ధం చేసి, హీరో ఎంపిక చేసుకుంటే మూవీ మొదలెడదామని హామీ ఇచ్చారట. ఇక హను నెక్స్ట్ మూవీ మైత్రి మూవీస్ బ్యానర్ లోనే ఉంటుంది అంటున్నారు. పారితోషికం కూడా భారీగా ఆఫర్ చేసినట్లు తెలుస్తుండగా.. హను పంటపడినట్లే అన్న మాట వినిపిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios