Asianet News TeluguAsianet News Telugu

కష్టాల్లో ఒక్కరూ సాయం చేయలేదు.. ఇల్లు కూడా అమ్ముకున్నాను.. మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు  షాకింగ్ కామెంట్స్ చేశారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన కలెక్షన్  కింగ్.. తను పడ్డ కష్టాలు పగవాడికి కూడా రావద్దన్నారు. 
 

Tollywood Senior Actor Manchu Mohan Babu Shocking Comments
Author
First Published Mar 19, 2023, 9:02 AM IST

టాలీవుడ్ డైలాగ్ కింగ్... నటప్రపూర్ణ మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈరోజు ( మార్చ్ 19)  71 పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆయన.. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గోన్నారు. ఈసందర్భంగా ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇప్పుడు తాను అనుభవిస్తున్న జీవితం అంత ఈజీగా రాలేదన్నారు సీనియర్ నటుడు. ఎన్నో కష్టాలు పడ్డానని.. అవి పగవాడికి కూడా రాకూడదన్నారు. అంతే కాదు తాన మూవీ కెరీర్ లో ఇల్లు అమ్ముకునేంత కష్టం ఎదురైనా.. ఏ ఒక్కరూ సాయానికి రాలేదన్నారు మోహన్ బాబు. పరిశ్రమలో అవకాశాల కోసం తిరిగే సమయంలో అయితే ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొవాల్సి వస్తుంది. అన్ని అవమానాలను, చీత్కారాలను ఎదుర్కొని వచ్చిన వాడే పరిశ్రమలో నిలదొక్కుకోగలుగుతాడు. తాను అన్నీ అనుభవించానన్నారు. 

రాయలసీమ కుటుంబ నేపథ్యం కలిగిన మంచు మోహన్ బాబు.. టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా 1970 లో మూవీ కెరీర్ ను స్టార్ట్ చేసి.. విలన్ గా, కమెడియన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల పాత్రలకు ప్రాణం పోశారు మోహాన్ బాబు. ఐదు వందలకు పైగా సినిమాల్లో నటించి మెహన్ బాబు.. నిర్మాతగా మారి లక్ష్మీ ప్రస్నా పిక్చార్స్ బ్యానర్ ను స్థాపించి 50కిపైగా సినిమాలు నిర్మించారు. ఇక సినిమా జీవితంలో పాటు సమాజసేవకుడిగా, విద్యావేత్తగా.. రాజకీయనాయకుడిగా తన మార్క్ చూపించిన మెహన్ బాబు.. తన నట వారసులను కూడా టాలీవుడ్ కు పరిచయం చేశారు. 

ఇంత నేపథ్యం కలిగిని మోహన్ బాబు.. తనకు ఈ జీవితం అంత సులభంగా రాలేదు అంటున్నారు. మోహన్ బాబు మాట్లాడుతూ..  పైకి నేను బాగానే కనిపించవచ్చు... కానీ  సినిమాల కోసం నేను చాలా కష్టపడ్డాను.. ఎలాటి ఇబ్బందులు ఫేస్ చేశానంటే.. ఒకానొక టైమ్ లో ఇబ్బందులు తట్టుకోలేక  నా ఇల్లు కూడా అమ్ముకున్నాను. అయితే అప్పుడు ఏ ఒక్కరు కూడా నాకు సాయం చేయలేదు. నా కష్టం మీదనే అన్ని సమస్యలు అధిగమించి మళ్లీ నిలబడ్డాను అన్నారు మెహన్ బాబు. అంతే కాదు నేను పడ్డ కష్టాలు.. నా పగవాడికి కూడా రాకూడదు అని అప్పుడప్పుడు అనుకుంటాను అన్నారు నట ప్రపూర్ణ. 

ఒకప్పుడు వెలుగు వెలిగిన తను.. ప్రస్తుతం ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్న విషయాన్ని ఒప్పుకున్నారు మోహన్ బాబు. తాను హీరోగా నటించిన సన్నాఫ్ ఇండియా, తన తనయుడు నటించిన జిన్నాసినిమాలు ప్లాప్ అయ్యాయని.. సోషల్ మీడియాలో తన కుటుంబంపై వస్తున్న ట్రోల్స్ ను పట్టించుకోవడం మానేశాన్నారు మోహన్ బాబు. తన రాజకీయ జీవితంలో ఆటు పోట్లు.. దాసరితో అనుబంధంతో పాటు.. మెగాస్టార్ చిరంజీవితో వివాదాలపై కూడా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మోహన్ బాబు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


 

Follow Us:
Download App:
  • android
  • ios