మాజీ ప్రధానమంత్రి వాజ్పేయ్ గురువారం ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం కన్నుమూశారు
మాజీ ప్రధానమంత్రి వాజ్పేయ్ గురువారం ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం కన్నుమూశారు. బీజేపీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఎన్డీయే లో ఐదేళ్లపాటు ప్రధానమంత్రిగా కొనసాగారు. భారత్ ప్రభుత్వం 2014లో భారత రత్న ఇచ్చి ఆయనను గౌరవించింది.
ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నటి ఈషా రెబ్బ.. వాజ్పేయ్ కి సంబంధించిన ఒక వీడియోని షేర్ చేస్తూ.. 'గొప్ప వ్యక్తి, ఉత్తమ ప్రధానమంత్రి ఇక లేరని తెలిసి బాధలో మునిగిపోయాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కురుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశారు. అలానే యాంకర్ రష్మీ కూడా ఆయనకు నివాళులు అర్పించింది.
Scroll to load tweet…
Scroll to load tweet…
