`టిల్లు స్క్వేర్` రిలీజ్ డేట్ వచ్చింది.. చిరుతో పోటీ నుంచి తప్పుకున్న టిల్లుగాడు
టాలీవుడ్లో క్రేజీ మూవీగా నిలిచిన `డీజే టిల్లు`కి ఇప్పుడు సీక్వెల్ వస్తుంది. `టిల్లు స్వ్కేర్` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే డేట్ కన్ఫమ్ అయ్యింది. రిలీజ్ డేట్ని ప్రకటించింది యూనిట్.
`డీజే టిల్లు` మూవీ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చి ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. యూత్ని ఆద్యంతం అలరించిందీ మూవీ. చిన్న సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది. సినిమా పేరే హీరో సిద్ధు జొన్నలగడ్డ పేరుని మార్చేసింది. టిల్లుగా సిద్దు ఫేమస్ అయ్యాడు. అంతగా ఆకట్టుకున్న ఈ సక్సెస్ఫుల్ మూవీకి ఇప్పుడు సీక్వెల్ వస్తుంది. `టిల్లు స్క్వేర్` పేరుతో ఈ సినిమా రూపొందుతుంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తుండగా, ఈ సీక్వెల్లో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. మొదటి భాగంలో నేహా శెట్టి హీరోయిన్గా చేసిన విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్తో కలిసి నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా సినిమా రిలీజ్ డేట్ని ప్రకటించింది యూనిట్. సెప్టెంబర్ 15న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. మొదటి ఆగస్ట్ 11 వస్తుందనే ప్రచారం జరిగింది. చిరంజీవి హీరోగా తెరకెక్కిన `భోళాశంకర్` సినిమా కూడా అదే డేట్కి వస్తుంది. దీంతో ఈ రెండింటి మధ్య పోటీ ఉంటుందని, చిన్న సినిమా అయినా మంచి క్రేజ్, బజ్ ఉన్న నేపథ్యంలో ఎంతో కొంత చిరంజీవి సినిమాపై ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. కానీ ఎట్టకేలకు ఆ పోరు నుంచి తప్పుకుంది. ఏకంగా నెల రోజులు బ్యాక్కి వెళ్లింది.
తాజాగా రిలీజ్ డేట్ని ప్రకటిస్తూ కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో సిద్ధు-అనుపమ పరమేశ్వరన్ కారులో ఫుల్ రొమాంటిక్ మూడ్లో ఉన్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే వినోదమే కాదు, రొమాన్స్ కూడా రెట్టింపే ఉంటుందని అర్థమవుతుంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని మించి రెట్టింపు వినోదాన్ని, థ్రిల్ ని అందిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
`శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 'డీజే టిల్లు' చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న సిద్ధు, అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, యువ ప్రతిభావంతుడు సిద్ధు అందించిన ఈ కొత్తతరం కామెడీ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా డీజే టిల్లు పాత్రను ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడ్డారు. ఇప్పుడు `డీజే టిల్లు` సీక్వెల్ 'టిల్లు స్క్వేర్'తో వస్తున్నారు. ఈసారి రెట్టింపు వినోదాన్ని పంచడానికి స్టార్ నటి అనుపమ పరమేశ్వరన్ తోడయ్యారు.
ఇప్పటికే `టిల్లు స్క్వేర్` పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఇక ఇప్పుడు విడుదల తేదీ ప్రకటనతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగింది. ఈ చిత్రానికి రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయ`ని యూనిట్ పేర్కొంది.