త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ యాడ్ షూట్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ యాడ్ ని డైరెక్ట్ చేసినందుకు త్రివిక్రమ్ తీసుకున్న పారితోషకం నిజంగా మైండ్ బ్లోయింగ్. 


ప్రస్తుతం అల్లు అర్జున్(Allu Arjun) ఖాళీగా ఉన్నారు. త్వరలో ఆయన పుష్ప 2 షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ కొన్ని యాడ్ షూటింగ్స్ పాల్గొంటున్నారు. అల్లు అర్జున్ క్రేజ్ నేపథ్యంలో ఆయనను బ్రాండ్ అంబాసర్ గా నియమించుకోవడానికి అనేక సంస్థలు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జొమాటో, రెడ్ బస్, ఫ్రూటీ వంటి సంస్థలకు అల్లు అర్జున్ ప్రచార కర్తగా ఉన్నారు. కొత్తగా ఆయన కొన్ని ఎండార్స్మెంట్ కి సైన్ చేసినట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగా ఓ కొత్త యాడ్ షూట్ లో అల్లు అర్జున్ పాల్గొన్నారు. 

హైదరాబాద్ లో జరిగిన ఈ యాడ్ ని త్రివిక్రమ్(Trivikram) డైరెక్ట్ చేశారు. ఒక్కరోజులో ముగిసిన ఈ యాడ్ కి దర్శకత్వం వహించినందుకు త్రివిక్రమ్ ఏకంగా రూ. 45 లక్షలు ఛార్జ్ చేశారట. గంటల వ్యవధిలో అంత సంపాదన అంటే మామూలు విషయం కాదు. అందులో యాడ్ ఏజెన్సీ ఇచ్చిన కాన్సెప్ట్ ని మక్కీకి మక్కి దించడమే. ఎలాంటి క్రియేటివిటీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. హీరో రెకమండేషన్ మీదే పూర్తిగా ఈ అవకాశాలు వస్తాయి. గతంలో అల్లు అర్జున్ ఓ యాడ్ ని డైరెక్ట్ చేసే అవకాశం హరీష్ శంకర్ కి ఇచ్చారు. ఈసారి త్రివిక్రమ్ కి ఈ ఛాన్స్ దక్కింది. 

మరోవైపు త్రివిక్రమ్ మహేష్(Mahesh Babu) మూవీ కోసం సిద్ధమవుతున్నారు. మహేష్ 28వ చిత్ర షూటింగ్ కి సర్వం సిద్ధం కాగా ఆగస్టు లో మొదలుకావాల్సి ఉంది. అయితే పరిశ్రమలో సందిగ్ధత వాతావరణం నెలకొని ఉంది. ఆగస్టు నుండి షూటింగ్స్ నిలిపివేయాలంటూ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం తీసుకుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్స్, ఖర్చులు అధికమయ్యాయని, ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతలు, బయ్యర్లు భారీగా నష్టపోతున్న తరుణంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

దీంతో ఆగస్టు లో మహేష్-త్రివిక్రమ్ మూవీ షూటింగ్ మొదలవుతుందా లేదా? అనే సందేహం నెలకొంది ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ఆలస్యం కావడం జరిగింది. రెగ్యులర్ షూట్ మొదలైతే త్వరితగతిన పూర్తి చేసిన 2023 సమ్మర్ కానుకగా విడుదల చేయాలనేది మేకర్స్ ప్లాన్. మరి ఎంత వరకు వాళ్ళ ప్రణాళిక కార్యరూపం దాల్చుతుందో చూడాలి. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు.