ప్రభాస్ మారుతీ కాంబో మూవీ రాజా సాబ్ కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో రాజా సాబ్ టీజర్ రిలీజ్ అవ్వడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈక్రమంలో ఈ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రికార్డ్ స్థాయిలో వ్యూస్ కూడా వచ్చాయి. 

పాన్ ఇండియా స్టార్ హీరో, టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘ది రాజాసాబ్. ఈ సినిమా పై ముందు నుంచే ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా గురించి అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను డైరెక్టర్ మారుతి హారర్ కామెడీ థీమ్‌తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది.

జూన్ 16న విడుదలైన ‘ది రాజాసాబ్’ టీజర్‌కు 24 గంటల్లోనే 59 మిలియన్లకు పైగా వ్యూస్ లభించాయి. ఇది ప్రభాస్‌ కెరీర్‌లోనే డిఫరెంట్ మూవీ కాబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల్లో ఈ టీజర్‌ కు రికార్డు స్థాయి స్పందన వస్తోంది. ప్రభాస్‌ నటన, డిఫరెంట్ లుక్. కామెడీ ప్లాస్ యాక్షన్, హారర్‌తో మేళవించిన కామెడీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ టీజర్‌ ట్రెండింగ్‌ లో ఉండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపించనున్నాడు. అతనికి జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మ్యూజిక్‌ డైరెక్టర్ ఎస్‌.ఎస్‌. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా, అద్భుతమైన విజువల్స్‌ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

ఈ భారీ చిత్రాన్ని మేకర్స్ డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మరోసారి రికార్డ్ కొట్టేస్తాడంటున్నారు ఫ్యాన్స్. అంతే కాదు ఈ సినిమాతో బాక్సాఫీస్‌ రికార్డులు తిరగరాయడం ఖాయమని మూవీ టీమ్ నమ్మకంతో ఉంది. మరి ఈమూవీ రిలీజ్ తరువాత ఏం జరుగుతుందో చూడాలి.