మెగా అభిమానులకు ‘బాస్ పార్టీ’.. ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.. డేట్ ఫిక్స్!
మెగాస్టార్ చిరంజీవి - బాబీ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). షూటింగ్ పూర్తి కావస్తుండటంతో మాస్ అప్డేట్స్ మొదలయ్యాయి. తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అభిమానులను అలరిస్తున్నారు. రీసెంట్ గా ‘గాడ్ ఫాదర్’తో భారీ సక్సెస్ ను అందుకున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ (Valtair Veerayya)లో నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు ఈ చిత్ర షూటింగ్ పూర్తికావచ్చింది. మరికొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానునుండటంతో మేకర్స్ వరుసగా మాస్ అప్డేట్స్ ను అందించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా అదిరిపోయే ప్రకటన చేశారు.
‘వాల్తేరు వీరయ్య’ నుంచి మెగా అభిమానులను గుడ్ న్యూస్ అందించారు మేకర్స్. మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సిద్ధం అయ్యిందని తెలిపారు. ‘బాస్ పార్టీ’ టైటిల్ లో మొదటి పాట దుమ్ములేపబోతుందని అన్నారు. నవంబర్ 23న సాయంత్రం 4:05 నిమిషాలకు ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. మెగా అభిమానులకు ఈ ఏడాది ‘బాస్ పార్టీ’ బిగ్గెస్ట్ పార్టీ కానుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. మళ్లీ రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో ఫస్ట్ సింగిల్ పై అంచనాలు నెలకొన్నాయి.
దర్శకుడు బాబీ చిరును మెగా అభిమానులు ఖుషీ అయ్యేలా వింటేజ్ లుక్ లో చూపించబోతున్నారు. చిత్ర పోస్టర్లు, గ్లింప్స్, కొన్ని లీక్ లతో మెగాస్టార్ వింటేజ్ లుక్ లో కనిపించడంతో ఫ్యాన్స్ మరింతగా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. బాస్ ను ఊరమాస్ లుక్ లో చూసి చాలా కాలం అవడంతో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం నిజంగా అభిమానులకు ట్రీట్ గానే మిగిలిపోనుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన గ్లామర్ బ్యూటీ శృతి హాసన్ (Shruti Haasan) నటిస్తోంది. మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రను పోషించారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. వచ్చే ఏడాది జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.