Asianet News TeluguAsianet News Telugu

అప్పుడు ప్రకాష్‌ రాజ్‌.. ఇప్పుడు మురళీ మోహన్‌.. అల్లు అర్జున్‌ విషయంలో ఇండస్ట్రీకి చురకలు..

బన్నీకి నేషనల్‌ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన్ని గౌరవించలేదని ఆ మధ్య ప్రకాష్‌ రాజ్‌ సెటైర్లు పేలవగా, ఇప్పుడు మరళీ మోహన్‌ సైతం చురకలు అంటించారు.
 

that time prakash raj now murali mohan react on allu arjun national award arj
Author
First Published Mar 23, 2024, 11:19 AM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కి గతేడాది జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వరించిన విషయం తెలిసింది. `పుష్ప` చిత్రంలోని ఆయన నటనకు ఈ అవార్డు దక్కింది. తెలుగులో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న తొలి హీరోగా అల్లు అర్జున్‌ రికార్డు సృష్టించారు. తెలుగు చిత్ర పరిశ్రమకే ఇదొక గర్వ కారణం. కానీ టాలీవుడ్‌ నుంచి ఎలాంటి స్పందన లేదు. జస్ట్ సోషల్‌ మీడియాలో విషెస్‌తో సరిపెట్టారు. చిరంజీవి తన ఇంట్లో సత్కరించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఓ పార్టీని అరెంజ్‌ చేశారు. అంతకు మించిన సత్కారం లేదు. 

Survey:వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

తోటి నటీనటులు కూడా ఈ విషయంలో అంటిముట్టనట్టుగానే వ్యవహరించారు. ఆ విషయాన్ని ఆ పార్టీలో ప్రకాష్‌ రాజ్‌ ప్రస్తావించారు. ఇండస్ట్రీ ఎందుకు సత్కరించుకోవడం లేదు. యాక్టర్స్ ఎందుకు ముందుకు రావడం లేదు. ఆ హెల్దీ అట్మాస్మియర్‌ కనిపించడం లేదు ఎందుకు అని ప్రశ్నించారు. ఇప్పుడు సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొదటి సారి తెలుగు నటుడికి జాతీయ అవార్డు వస్తే కనీసం గౌరవించుకోలేదని ఇండస్ట్రీ పెద్దలకు చురకలు అంటిచ్చారు. 

శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో సౌత్‌ ఇండియ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరిగింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు. వారితోపాటు మురళీ మోహన్‌, నిర్మాత అల్లు అరవింద్‌ వంటి కొందరు దర్శక, నిర్మాతలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇందులో అల్లు అర్జున్‌ ప్రస్తావన తీసుకొచ్చారు మురళీ మోహన్‌. అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డు వస్తే చిత్ర పరిశ్రమ కనీసం సన్మానించలేదు ఎందుకు అని ప్రశ్నించారు. మేము చెన్నైలో ఉన్నప్పుడు ఇలా ఉండేది కాదన్నారు. అయితే చిరంజీవినైనా గౌరవిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. పరోక్షంగా ఇండస్ట్రీ పెద్దలకు చురకలు అంటించారు మురళీ మోహన్‌.

చిరంజీవికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వారిని సత్కరించింది. ఇండస్ట్రీ మొత్తం కదిలి ఆయన్ని అభినందించారు. మరోసారి ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ చిరంజీవిని సత్కరించారు. ఈ సందర్భంగా మురళీ మోహన్‌ చేసిన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్‌ `పుష్ప2`లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Read more: సావిత్రి, విజయ నిర్మల దారిలో సాయిపల్లవి.. కొత్త బాధ్యతలకు శ్రీకారం.. లేడీ పవర్‌ స్టార్‌ని అలా చూడబోతున్నామా?
 

Follow Us:
Download App:
  • android
  • ios