'ఫైటర్" ..పూరి సైలెంట్, కారణం చైనా లింక్?
ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్లు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ముంబైలో 40 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది.
రామ్ తో చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు పూరి జగన్నాథ్. ఈ సినిమా సక్సెస్ తరువాత అర్జున్ రెడ్డి స్టార్ విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నారు. ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్లు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ముంబైలో 40 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది.
అయితే ఆ తర్వాత షెడ్యూల్ కూడా ముంబైలోని ధారవిలో జరగాల్సీవుండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. మిగతా యంగ్ హీరోలంతా తమ షూట్ లు మొదలెట్టి బిజీ అవుదతూంటే పూరి మాత్రం ఈ సినిమా గురించి మాట్లాడటం లేదు. సైలెంట్ గా ఉండిపోయారు. అందుకు కారణం ఏమై ఉంటుందనేది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాక్సింగ్ ఛాంపియన్ పాత్రలో చైనీస్ కానీ థైవాన్ భాక్సర్ అవసరం అవుతారు. అయితే కరోనా కంట్రోలులో లేని నేటి పరిస్దితుల్లో వారిని ఇండియాకు రప్పించటం కష్టం. అలాగని అక్కడకి వెళ్లలేము. దాంతో ఎక్కడైతే కరోనా పూర్తి కంట్రోలులో ఉందో ఆ దేశంకు వెళ్లి షూట్ చేద్దామని నిర్ణయానికి వచ్చారట.మరో ప్రక్క ఫైటర్ సినిమా నిర్మాతలు ఇక్కడే హైదరాబాద్ లోనే ప్రత్యేకమైన సెట్స్ లో మూవీని పూర్తి చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై దర్శకుడు, హీరో ఓ నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. అందుకే పూరి సైలెంట్ గా ఉన్నారట.
ఇక తెలుగు హిందీ భాషాల్లో మాత్రమేకాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది . ఫైటర్లో విజయ్కు జోడిగా హిందీ భామ, స్టార్ కిడ్ అనన్య పాండే నటిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ ను కొత్తగా చూపించి మెప్పించిన పూరి, విజయ్ ను ఎలాంటి లుక్ లో చూపించబోతున్నారో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.