విజయ్ ‘వారిసు’(వారసుడు) OTTలో ఎప్పుడంటే....
వారిసు సినిమా తమిళంలో అద్భుతమైన వసూళ్లను దక్కించుకుంటోంది. నాలుగు రోజుల్లోనే వంద కోట్ల మైలురాయిని దాటింది.
సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాల్లో విజయ్ నటించిన వారసుడు ఒకటి.తమిళ డబ్బింగ్ గా రిలీజైన ఈ చిత్రం అక్కడ కన్నా నాలుగు రోజులు లేటు గా ఇక్కడ రిలీజైంది. దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిందీ సినిమా. తమిళంలో వారిసు పేరుతో ముందుగానే విడుదలైంది. ఈ చిత్రానికి మిక్సెడ్ టాక్ వచ్చింది. తెలుగులో బాలయ్య, చిరంజీవి సినిమాల ఉండటంతో ఈ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఈ సినిమా ఓటిటిలో ఎప్పుడు వస్తుంది చూద్దామని చాలా మంది ఎదురుచూస్తున్నారు.
తమిళ సినిమా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు విజయ్ వారిసు సినిమా వచ్చే నెలలోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన వారిసు సినిమా ఫిబ్రవరిలోనే ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. వారిసు డిజిటల్ రైట్స్ను భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. థియేటర్లలో రిలీజైన ముప్పై నుంచి నలభై రోజుల గ్యాప్లోనే ఓటీటీలో రిలీజ్ చేసేలా నిర్మాతతో ఓటీటీ సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు చెప్తున్నారు. ఆ ఎగ్రిమెంట్ కారణంగానే ఫిబ్రవరిలో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమిళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా ఒకేరోజు రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.
వారిసు సినిమా తమిళంలో అద్భుతమైన వసూళ్లను దక్కించుకుంటోంది. నాలుగు రోజుల్లోనే వంద కోట్ల మైలురాయిని దాటింది. విజయ్ కెరీర్లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. వారిసు సినిమా వారసుడు పేరుతో తెలుగులో శనివారం రిలీజైంది. మొదటిరోజు తెలుగులో వారసుడు సినిమా 3.10 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. మాస్టర్, బీస్ట్ తర్వాత తెలుగులో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన విజయ్ సినిమాగా వారసుడు నిలిచింది. ఈ సినిమా 15 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్తో సంక్రాంతి బరిలోకి దిగింది. అయితే అంత మొత్తం చేయకపోవచ్చని అంటున్నారు ట్రేడ్ పండితులు
ఓ వైపు వాల్తేరు వీరయ్య, మరోవైపు వీరసింహారెడ్డి సినిమాలు ఉండడంతో పాటు అవి మంచి టాక్తో దూసుకుపోవడం ఒక కారణం అయ్యితే.. వారసుడు సినిమా బాగున్నప్పటికీ ... ఈ కంటెంట్ తెలుగులో ఇప్పటికే చాలా సార్లు రావడం ఒక కారణం అని అంటున్నారు. విజయ్కు తెలుగులో అంతగా పాపులారిటీ లేకపోవడం కూడా ఓ కారణం అని అంటున్నారు. ఈ సినిమాలో విజయ్కి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. శరత్కుమార్, జయసుధ, శ్రీకాంత్, శామ్, సంగీత కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతాన్ని అందించాడు.