వైరల్: యాత్ర సినిమా చూస్తూ ఏడ్చేసిన టీడీపీ నేత
రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్న సమయంలో రిలీజైన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ యాత్ర ఓ వర్గం వారిని బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది. వైఎస్ అభిమానులు సినిమా చూసి భావోద్వేగానికి లోనయినట్లు చెబుతున్నారు.
రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్న సమయంలో రిలీజైన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ యాత్ర ఓ వర్గం వారిని బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది. వైఎస్ అభిమానులు సినిమా చూసి భావోద్వేగానికి లోనయినట్లు చెబుతున్నారు. అయితే సినిమాకు ఇతర పార్టీల వర్గాల నుంచి నెగిటివ్స్ కామెంట్స్ కూడా అందుతున్నాయి. అయితే ప్రస్తుతం ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వైఎస్ఆర్ సిపి పేరుతో ఉన్న ట్విట్టర్ ఎకౌంట్ నుంచి వెలువడిన ఒక ట్వీట్ లో ఫోటో యాడ్ చేస్తూ తెలుగుదేశం నాయకుడు సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఇది ఎంతవరకు నిజం అనే విషయం ఎవరు పట్టించుకోవడం లేదు గాని వైఎస్ అభిమానులు ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఆ సినిమా చుస్తే ఎవ్వరికైనా కన్నీళ్లు వచ్చేస్తాయని చెబుతున్నారు.
#యాత్ర సినిమా చూస్తూ కన్నీళ్లు కారుస్తున్న తెలుగుదేశం నాయకుడు అత్తోట చంటి గారు#Yatra pic.twitter.com/re78Unm7ky
— 2019YSRCP (@2019YSRCP) February 8, 2019
కడప రాయలసీమ వంటి ప్రాంతాల్లో యాత్ర సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో మంచి ఓపెనింగ్స్ అందుకుంది. మహి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వైఎస్ యాత్రను ప్రధానంగా చేసుకొని తెరకెక్కించారు.