"వినరో భాగ్యము విష్ణు కథ" టీమ్ చిత్ర ఆడియో లాంచ్ ఈవెంట్ లో పన్నెండు తరాలకు సంబంధించిన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారసులను సన్మానించడం విశేషం.
కుర్ర హీరో కిరణ్ అబ్బవరం టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. తన సినిమాలో ఏదో ఒక విషయం ఉంటుందనే పేరైతే సంపాదించాడు. కాకపోతే గత సినిమాలు ఆశించిన రిజల్డ్ ని సాధించలేకపోయాయి. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన `వినరో భాగ్యము విష్ణుకథ` ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో అందరినిలోనూ ఆసక్తి నెలకొంది. దీనికితోడు టీజర్, ట్రైలర్, `వాసవ సుహాస` పాటకి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఈ పాటే సినిమాకి హైప్ తీసుకొచ్చింది.
ఇదిలా ఉంటే ఆదివారం ఈ చిత్ర ఆడియో రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. తిరుపతి వేదికగా ఈ వేడుక జరపడం విశేషం. ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న థియేటర్స్ లో భారీగా విడుదల కాబోతుంది. ఈ తరుణంలో సినిమా ప్రోమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి.ఇందులో భాగంగా "వినరో భాగ్యము విష్ణు కథ" చిత్ర యూనిట్ తిరుమల శ్రీ వేంటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
ఈ సినిమా ఎక్కువ శాతం తిరుపతిలోనే జరిగింది. దీంతో చిత్ర ఆడియో రిలీజ్ వేడుకను కూడా తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. సినిమా ప్రొమోషన్స్ మొదలు పెట్టినప్పటినుండి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది చిత్ర యూనిట్. కళా తపశ్వి కే విశ్వనాధ్ గారిచే "వాసవ సుహాస" పాటను లాంచ్ చేయడం అందరి అటెన్షన్ పెరిగింది. పైగా ఆదివారం ఆడియో లాంచ్ ఈవెంట్ లో పన్నెండు తరాలకు సంబంధించిన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారసులను సన్మానించడం విశేషం. వాళ్లు సినిమాలోని `సోల్ ఆఫ్ తిరుపతి` అంటూ సాగే నాల్గొవ పాటని ఆవిష్కరించడం విశేషం.
ఒకవైపు సామాన్య ప్రజలచే సాంగ్స్ లాంచ్ చేయించడంతో పాటు, మరోవైపు పెద్దలకు తగిన గౌరవం ఇస్తూ వాళ్ళతో కొన్ని పాటలను లాంచ్ చేయించడం ఈ చిత్ర యూనిట్ ప్రత్యేకత. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ సభ్యుల మన్ననలు పొంది U/A సర్టిఫికెట్ ను సాధించుకుంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడుగా పరిచయం అవుతున్న ఈ సినిమాను, GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా, అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.
