రియానే మొత్తం చేసింది.. బాంబ్ పేల్చిన సుశాంత్ అసిస్టెంట్
సుశాంత్ జీవితానికి సంబంధించి, రియాకి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు మాజీ అసిస్టెంట్ అంకిత్ ఆచార్య. సుశాంత్ వద్ద దాదాపు మూడేళ్ళపాటు పనిచేశానని చెప్పాడు. ఆ మూడేళ్లలో సుశాంత్ భయ్యా ఇంట్లో ఉండగా లోపల వైపు గడియా పెట్టుకోవడం తానెప్పుడూ చూడలేదని చెప్పాడు.
సుశాంత్ జీవితంలోని వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కో షాకింగ్ విషయాలను వెల్లడిస్తున్నారు. సుశాంత్ తండ్రి ఫిబ్రవరిలోనే ప్రాణాపాయం ఉందని పోలీసులను ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. సుశాంత్ వంట మనుషులు మరో విషయాలను తెలిపారు. తాజాగా సుశాంత్ మాజీ అసిస్టెంట్ అంకిత్ ఆచార్య బాంబ్ పేల్చారు. రియాకి సంబంధించిన సంచలన వాస్తవాలను తెలిపారు.
జాతీయ మీడియాతో ముచ్చటిస్తూ సుశాంత్ జీవితానికి సంబంధించి, రియాకి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సుశాంత్ వద్ద దాదాపు మూడేళ్ళపాటు పనిచేశానని చెప్పాడు. ఆ మూడేళ్లలో సుశాంత్ భయ్యా ఇంట్లో ఉండగా లోపల వైపు గడియా పెట్టుకోవడం తానెప్పుడూ చూడలేదని చెప్పాడు. బాంద్రాలోని అపార్ట్మెంట్లో సుశాంత్ చనిపోయి ఉన్నప్పుడు గదికి లోపల వైపు గడియ పెట్టి ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అంకిత్ చెప్పిన విషయం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది.
ఇంకా అతను చెబుతూ, తాను గతేడాది ఆగస్ట్ లో సొంత ఊరికి వెళ్ళానని, తిరిగి వచ్చేసరికి సుశాంత్ వ్యక్తిగత సిబ్బందిని మార్చేశారని, గతంలో పనిచేసిన వారెవరూ లేరని చెప్పాడు. సుశాంత్ దగ్గర కొత్తగా పనిచేస్తున్న బాడీగార్డ్స్ తనను ఇంట్లోకి కూడా అనుమతించలేదన్నాడు. సిబ్బందిని రియా మేడమ్ మార్చి ఉండొచ్చని పిడుగులాంటి విషయాన్ని వెల్లడించాడు. సుశాంత్ అకౌంట్లో గతేడాది ముప్పై కోట్ల వరకు ఉన్నాయని, రియా డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసేదని అంకిత్ చెప్పాడు. దీంతో గతేడాది నుంచే రియా ప్లాన్ చేసిందా? అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
గతేడాది సెప్టెంబర్లో తనకు ఇవ్వాల్సిన డబ్బును ఇచ్చేసిన సందర్భంలో సుశాంత్ను కలిశానని, పూర్తిగా మారిపోయాడని, అతని ముఖంలో నవ్వు లేదని, తీవ్ర మానసిక వేదన కనిపించిందని అంకిత్ చెప్పాడు. సుశాంత్ ఎలాంటి మెడిసిన్ వాడే వాడు కాదని పేర్కొన్నాడు. ఇలా సుశాంత్ మాజీ అసిస్టెంట్ వెల్లడిస్తున్న విషయాలు కేసుని మరో మలుపు తిప్పేలా ఉన్నాయి.