నా సినిమా చూడద్దంటూ ఫేస్ బుక్ లో డైరక్టర్ పోస్ట్,నిర్మాత కంప్లైంట్
థియోటర్స్ లో ఈ సినిమా చూడవద్దని..తిరిగి తను క్లారిటీ ఇచ్చేదాకా వెయిట్ చేయమని కోరారు సరోజ్ కుమార్.
ప్రవీణ్ రెడ్డి, బండి సరోజ్, హిమాన్షి, కావ్యా సురేశ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `సూర్యాస్తమయం`. శ్రీహార్సీన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై బండి సరోజ్ దర్శకత్వంలో క్రాంతి కుమార్ తోట ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే వివాదంలో చిక్కుకుంది. ఈ మేరకు నిర్మాతలు ఓ ప్రెస్ మీట్ నిర్వహించి , దర్శకుడు వ్యవహించే తీరు, పద్దతి బాగోలేదని అంటున్నారు. మరో ప్రక్క డైరక్టర్ బండి సరోజ్ కుమార్ తన ఫేస్ బుక్ పేజీలో తన డైరక్ట్ చేసిన ఈ సినిమా చూడవద్దని పోస్ట్ పెట్టారు.
ఆ పోస్ట్ లో నిర్మాతలు తన సూర్యాస్తమయం సినిమాలో తను నటించిన సీన్స్ కొన్నింటిని కావాలనే డిలేట్ చేసారని అన్నారు. వాళ్లపై కేసు పెడతానని, తన క్రియేటర్ రైట్స్ ని ఉల్లంఘించినందుకు,తన ఫర్మిషన్, నోటీసు లేకుండా చేయటమేంటని అన్నారు. అలాగే థియోటర్స్ లో ఈ సినిమా చూడవద్దని..తిరిగి తను క్లారిటీ ఇచ్చేదాకా వెయిట్ చేయమని కోరారు సరోజ్ కుమార్.
మరో ప్రక్క నిర్మాత మాట్లాడుతూ...చిన్న సినిమా తీయటం,రిలీజ్ చేయటం చాలా కష్టమని, అయినా తాము చేసామని, ఇప్పుడు డైరక్టర్ స్వయంగా సినిమా చూడవద్దని పోస్ట్ పెట్టడం ఏం భావ్యమని అంటున్నారు. సినిమాలో లాగ్ బాగా ఉందని అందుకే తాము కొంత ఎడిట్ చేయించామని, డైరక్టర్ తన దగ్గరే రషెష్ పెట్టుకున్నారని, తమకు ఇవ్వటం లేదని, సక్సెస్ మీట్ పెట్టాల్సిన టైమ్ లో ఇలాంటి ఆరోపణలతో మీడియా ముందుకు రావటం చాలా బాధగా ఉందని అన్నారు. ప్రొడ్యసర్ కౌన్సిల్ లో కూడా తాము కంప్లైంట్ చేసామని అన్నారు. డైరక్టర్ అశోశియోషన్ లో సరోజ్ కుమార్ మెంబర్ కాదని, అందుకే వారి నుంచి లెటర్ వచ్చాక, పోలీస్ కంప్లైంట్ కూడా ఇద్దామనుకుంటున్నామని అన్నారు.
ఇదిలా ఉండగా..ఈరోజు ఉదయం 10గంటలకు నా pressmeet ఉంది. రాత్రి నుంచీ రాజకీయ నాయకులతో, సినిమా చాంబర్ల మెంబర్లతో compromise కి ఫోన్లు చేయిస్తున్నారు. ఈ ఆలోచన మీరు నిన్న చేసిన తప్పుకి ముందు చేసుంటే బాగుండేది. టెన్షన్ పడకండి. నేను మీ అంత దిగజారి మాట్లాడను. I అంటూ సరోజ్ కుమార్ మరో ఫేస్ బుక్ పోస్ట్ పెట్టారు.
సినిమాలో 11 శాఖలను నిర్వహిస్తూ బండి సరోజ్ కుమార్ 'సూర్యాస్తమయం' పేరుతో సినిమా తీశారు. కీలక బాధ్యతలు చేపట్టిన ఆయన ప్రధాన పాత్రలో కూడా నటించారు. బండి సరోజ్కుమార్ మాట్లాడుతూ "సూర్యస్తమయం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. సహజసిద్ధమైన లొకేషన్లలో, నటీనటులకు మేకప్ లేకుండా తీశాం. ఇదే నేచురల్ యాక్షన్ మూవీ. ఒక పోలీస్కి, గ్యాంగ్స్టర్కి మధ్య జరిగే అంతర్యుద్దం ఈ సినిమాలో ప్రధానాంశం. పోలీస్ పాత్రలో నేను, గ్యాంగ్ స్టర్గా త్రిశూల్ రుద్ర నటించాం. తమిళ నటుడు డేనియర్ బాలాజీ మరో ముఖ్యపాత్రని చేశారు. హైదరాబాద్, వికారాబాద్, నల్లగొండ, కడప, కర్ణాటకలో చిత్రీకరణ జరిపాం" అని తెలిపారు. ఈ చిత్రంలో ఇంకా హిమాన్సీ కాట్రగడ్డ, కావ్యా సురేష్, డేనియల్ బాలాజీ, మోహన్ సేనాపతి, వివేక్ ఠాగూర్ తదితరులు నటించారు.