లాక్ డౌన్లో కేజీఎఫ్ క్రేజ్.. సీక్వెల్కు భారీ డిమాండ్
లాక్ డౌన్ కాలంలో కేజీఎఫ్ మరోసారి సత్తా చాటింది. లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన ప్రజలు కేజీఎఫ్ సినిమాను చూసేందుకు ఎగబడ్డారట. ఓ సమయంలో ఈ సినిమా టాప్లో ట్రెండ్ అయ్యింది. దీంతో ఇప్పుడు కేజీఎఫ్ 2 సీక్వెల్కు భారీ డిమాండ్ ఏర్పడింది.
బాహుబలి తరువాత అదే స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న సౌత్ సినిమా కేజీఎఫ్. కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కన్నడ యంగ్ హీరో యష్ కథానాయకుడిగా నటించాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఈ మూవీ సీక్వెల్పై భారీ క్రేజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగా సీక్వెల్ను ప్రస్టీజియస్గా రూపొందిస్తున్నారు చిత్రయూనిట్.
అయితే లాక్ డౌన్ కాలంలో కేజీఎఫ్ మరోసారి సత్తా చాటింది. లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన ప్రజలు కేజీఎఫ్ సినిమాను చూసేందుకు ఎగబడ్డారట. ఓ సమయంలో ఈ సినిమా టాప్లో ట్రెండ్ అయ్యింది. దీంతో ఇప్పుడు కేజీఎఫ్ 2 సీక్వెల్కు భారీ డిమాండ్ ఏర్పడింది. తొలి భాగంలో రాఖీ భాయ్ పాత్రలో సత్తా చాటిన యష్, సీక్వెల్ లో మరింత ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫామెన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
పీరియాడిక్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాను హొంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగండూర్ నిర్మించాడు. యస్ కు జోడిగా శ్రీనిధి శెట్టి నటించగా, అనంత్ నాగ్, మాళవిక అవినాష్, వషిష్ట ఎన్ సింహాలు కీకల పాత్రల్లో నటించారు. రవి బస్రూర్ అందించిన ఈ సినిమా సంగీతం సూపర్ హిట్ అయ్యింది.