Asianet News TeluguAsianet News Telugu

వేకేషన్ లో మహేశ్ బాబు ఫ్యామిలీ.. బ్యూటీఫుల్ ఫొటోను షేర్ చేసిన సూపర్ స్టార్!

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కుటుంబంతో కలిసి వేకేషన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి నుంచి ఓ బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఫొటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఫొటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
 

Superstar Mahesh Babu shared a beautiful family photo from their vacation!
Author
First Published Dec 27, 2022, 5:11 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో, సూపర్ స్టార్ మహేశ్ బాబు తన సినీ కెరీర్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ‘సర్కారు వారి పాట’తో మంచి హిట్‌ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ కొనసాగుతుండటంతో నెక్ట్స్ ఫిల్మ్స్ ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.అయితే, మహేశ్ బాబు సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో కుటుంబ సభ్యులతో గడిపేందుకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంటారు.  సాధారణంగా మహేశ్ బాబు ఫ్యామిలీతో కలిసి ఏడాదికి నాలుగైదు సార్లు వేకేషన్స్ కు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఇప్పటికే రెండు, మూడు సార్లు వేకేషన్ కు వెళ్లగా.. తాజాగా మరోసారి విదేశాలకు పయనమయ్యారు. 

క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ 2023 సెలవులను జరుపుకోవడానికి మహేష్ బాబు తన భార్య నమ్రతా శిరోద్కర్, కొడుకు గౌతమ్ ఘట్టమనేని, కుమార్తె సితారతో కలిసి స్విట్జర్లాండ్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సుందరమైన స్విస్ పట్టణమైన లూజర్న్‌లో ఉన్నారు. అక్కడి నుంచి మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ ట్రీముందు స్టైలిష్ స్టిల్స్ లో ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకుంది. మహేశ్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ లలో నెవర్ బిఫోర్ పిక్ ఇది. బ్యూటీఫుల్ ఫొటోతో ఫ్యాన్స్ కు మరిచిపోలేని ట్రీట్ అందించారు. ఈ ఫొటోస్ కు లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్స్ వస్తూ వైరల్ అవుతోంది.

ఈ ఫొటోను షేర్ చేసుకుంటూ ‘మో లూజర్న్... నేను మీ అభిమానిని’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో స్విజ్జర్లాండ్ లో ఆ ప్లేస్ అంటే మహేశ్ బాబుకు ఎంత ఇష్టమో అర్థమవుతోంది. ఇక విలాసవంతమైన రిసార్ట్ అయిన మాండరిన్ ఓరియంటల్ ప్యాలెస్‌లో ఫ్యామిలీతో గడుపుతున్నట్లు తెలిపారు. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను పూర్తి చేసుకొని వచ్చే నెలలో హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. అప్ కమింగ్ ప్రాజెక్ట్ప్ ను పూర్తి చేసేందుకు సిద్ధంకానున్నారు. 

పదేండ్ల తర్వాత స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్  - మహేశ్ బాబు కాంబినేషన్ సెట్ అయ్యింది. హారిక అండ్ హాసిని క్రాయేషన్స్ లో బ్యానర్ లో ‘ఎస్ఎస్ఎంబీ 28’ వర్క్ టైటిల్ గా చిత్రం రూపుదిద్దుకుంటోంది. పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. వేకేషన్ నుంచి మహేశ్ బాబు తిరిగి రాగానే లాంగ్ షెడ్యూల్ తో సినిమాను పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో నటించనున్నారు. వచ్చే ఏడాది జూన్ లో ఈ సినిమా ప్రారంభం కానుంది. అడ్వెంచర్ అండ్ యాక్షన్ ఫిల్మ్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios