Asianet News TeluguAsianet News Telugu

స్టైలిష్ లుక్ లో మహేశ్ బాబు.. వైరల్ అవుతున్న సూపర్ స్టార్ లేటెస్ట్ పిక్.!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా కోసం సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ఫిట్ గానూ, హ్యాండసమ్ లుక్ లోనూ అదరగొడుతున్న విషయం తెలిసిందే.  తాజాగా జిమ్ లో వర్కౌట్ చేస్తున్న పిక్ నెట్టింట వైరల్ గా మారింది.
 

Superstar Mahesh Babu Latest Photo gone Viral!
Author
First Published Dec 9, 2022, 6:54 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ28’(SSMB28). ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమై ఫస్ట్ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. పదేండ్ల తర్వాత కలిసిన ఈ క్రేజీ కాంబోలో వస్తున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు మహేశ్ బాబు కూడా సినిమా కోసం మరింతగా శ్రమిస్తున్నారు. ఫిజికల్ ఫిట్ నెస్ తో పాటు హ్యాండసమ్ గా కనిపించేందుకు కేర్ తీసుకుంటున్నారు. 

మహేశ్ బాబు స్టైలిష్ లుక్, జిమ్ వర్కౌట్స్ కు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే వైరల్ గా మారాయి. తాజాగా మరో స్టైలిష్ లుక్ లో మహేశ్ బాబు అదిరిపోయారు. జిమ్ వేర్ లో ఫిజికల్ థెరపిస్ట్ డాక్టర్ మినాష్ గాబ్రియేల్ తో కలిసి స్టైలిష్ గా సెల్ఫీకి స్టిల్ ఇచ్చారు. చేతిలో వాటర్ బాటిల్ పట్టుకొని స్టైలిష్ పోజ్ లో అభిమానులను ఖుషీ చేశారు. ఇన్ స్టా గ్రామ్ ద్వారా పంచుకున్న ఈ పిక్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో దూసుకుపోతోంది. మహేశ్ పై పొగడ్తల వర్షం కురిపిస్తూ ఫొటోను మరింతగా వైరల్ చేస్తున్నారు. 

అయితే, మహేశ్ బాబు ఇంట్లో వరుస విషాదాలు నెలకొనడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పుట్టేడు శోకం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు మహేశ్ బాబు. మరోవైపు పూజా హెగ్దే (Pooja Hegde) కూడా కాలు నొప్పితో ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటోంది. దీంతో ‘ఎస్ఎస్ఎంబీ28’ షూటింగ్ కు కాస్తా బ్రేక్ పడింది. కొద్దిరోజుల్లో మళ్లీ ప్రారంభించనున్నారు. ఇందుకోసమే మహేశ్ బాబు వర్కౌట్స్ ప్రారంభించారు. అటు పూజా కాలి గాయం కూడా ఆల్మోస్ట్ క్యూర్ అయినట్టు తెలుస్తోంది. ఈనెలలోనే నెక్ట్స్ షెడ్యూల్ కు వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ ఇప్పటికీ సెన్సేషన్ గానే మిగిలాయి. ఈ సినిమాల్లో ప్రతి సీన్ ఇంకా అభిమానుల మనస్సుల్లో నాటుకునే ఉన్నాయి. ఈ క్రమంలో మరోసారి వీరి కాంబోలో సినిమా వస్తుండటం భారీ అంచనాలకు దారి తీస్తోంది. ఇక పూజా హెగ్దే మహేశ్ బాబు సరసన రెండోసారి నటించే అవకాశాన్ని అందుకుంది. హారిక అండ్ హాసినీ బ్యానర్ పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios