Asianet News TeluguAsianet News Telugu

హైటెక్ సిటీలో మహేశ్ బాబు.. వైరల్ అవుతున్న వీడియో.. ఏం పనిమీద వచ్చారంటే?

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu) తాజాగా హైటెస్ సిటీలో సందడి చేశారు. తన వ్యక్తిగత పనిపై బయటికి వచ్చిన సూపర్ స్టార్ ను చూసి ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
 

Superstar Mahesh babu at Hitech city Aadhaar center
Author
First Published Feb 9, 2023, 4:43 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్  ఉంటుందో కూడా వివరించాల్సిన పనిలేదు. అయితే మహేశ్ బాబు చాలా అరుదుగా బయటకి వస్తుంటారు. షూటింగ్స్ లేదంటే వేకేషన్స్ కు, అలాగే ఇవెంట్లకు హాజరవాల్సిన సమయాల్లోనే బయట కనిపిస్తుంటారు. కానీ తాజాగా తన వ్యక్తిగత పనిపై  మహేశ్ బాబు హైటెక్ సిటీలో అభిమానులకు దర్శనమిచ్చారు. మహేశ్ ను చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ఇంతకీ మహేశ్ బాబు బయటికి ఎందురావాల్సి వచ్చిందంటే.. తన ఆధార్ కార్డ్ కు సంబంధించిన వెరిఫికేషన్ కోసం వచ్చారని తెలుస్తోంది. ఇందుకోసం హైటెక్ సిటీలోని దుర్గం చెరువు వద్ద ఉన్న ఆధార్ కార్డు వెరిఫికేషన్ సెంటర్ కు వెళ్లారు. సెంటర్ లో మహేశ్ బాబు తన ఆధార్ ను వెరిఫై చేసుకుంటున్న సమయంలో ఫ్యాన్స్ వీడియో తీసి నెట్టింట వదిలారు. అదికాస్తా వైరల్ అవుతోంది. అయితే మహేశ్ బాబు చాలా సింపుల్ గా ఎలాంటి హడావుడి లేకుండా బయటకు రావడం విశేషం. లాంగ్ హెయిర్, సింపుల్ షర్ట్ లో సెంటర్ కు వచ్చి సైలెంట్ గా తన పని ముగించుకొని తిరిగి వెళ్లిపోయారు. 

చివరిగా మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’తో అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఎస్ఎస్ఎంబీ28’లో నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ రెగ్యూలర్ గా కొనసాగుతోంది. ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల చేసేందుకు మేకర్స్ షెడ్యూల్ చేశారు. హారిక అండ్ హాసిని బ్యానర్ పై చిన్నబాబు, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఆ తర్వాత మహేశ్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నాు. ‘ఎస్ఎస్ఎంబీ29’గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూన్ లేదా జూలై ప్రారంభించే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios