నటుడు సునీల్ ఇటీవల వరుస చిత్రాల్లో విభిన్న పాత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తున్నారు. ‘పుష్ప’లో నెగెటివ్ రోల్స్ చేసి ఆకట్టుకున్న ఆయన.. ‘ఆర్సీ15’లోనూ అదిరిపోయే క్యారెక్టర్ లో నటిస్తున్నారు.   

మెగా పవర్ స్టార్ రామ్ చరన్ హీరోగా నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ‘ఆర్సీ15’. క్రియేటివ్ దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో మలయాళం యాక్టర్ జయరాం, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తాజాగా సునీల్ (Sunil) ‘ఆర్సీ15’లో తన పాత్రపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

కమెడియన్ గా దశాబ్దకాలం పాటు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు సునీల్. ఆ తర్వాత తనలోని హీరోను కూడా పరిచయం చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా ‘కలర్ ఫొటో’, ‘పుష్ఫ’ చిత్రాల్లో నెగెటివ్ షెడ్స్ఉన్న పాత్రల్లో నటించి ఆడియెన్స్ ను భయపెట్టాడు. ముఖ్యంగా ‘పుష్ఫ’లో మంగళం శ్రీను పాత్రతో తనలోని కొత్త కోణాన్ని పరిచయం చేశాడు. ప్రస్తుతం ‘ఎఫ్3’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ ‘ఆర్సీ158లో తన రోల్ పై ఆసక్తిరమైన విషయాలను వెల్లడించారు. ‘‘ఆర్సీ15’ మూవీలో రామ్ చరణ్ పక్కనే ఉండే ఓ అద్భుతమైన క్యారెక్టర్ నాది. మునుపెన్నడూ చూడలేనంతగా ఉంటుంది. చాలా హిలేరియస్ గా ఉండనుంది. ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది. అలాంటి అవకాశం ఇచ్చిన దర్శకుడు శంకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు.’ అని పేర్కొన్నాడు. 

ఇక ఆర్సీ 15మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. దర్శకుడు శంకర్ ప్రస్తుతం భారీ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కియారా అద్వానీ (Kiara Advani) నటిస్తోంది. ఓ స్పెషల్ రోల్ లో హీరోయిన్ అంజలి కూడా కనిపించనుంది. రూ.170 కోట్లతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు.