దేవిశ్రీ ప్రసాద్ - సుకుమార్ మధ్య 2 కోట్ల చిచ్చు, మరి పుష్ప2 పరిస్థితి ఏంటీ...?
ఆర్య సినిమా నుంచి కొనసాగుతుంది సుకుమార్ - దేవిశ్రీ ప్రసాద్ విడదీయలేని బంధం. అటువంటి వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయంటే.. అది కూడా డబ్బు విషయంలో వచ్చాయంటే నమ్మశక్యంగా లేదు కదా..? కాని ఈ రూమర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హడావిడిచేస్తోంది.
సుకుమార్ అంటే దేవిశ్రీ.. దేవిశ్రీ అంటే సుకుమార్ అన్నట్టుగా ఉంటారు ఇద్దరు. ఏ సినిమా చేసిన అది ఇద్దరి కాంబినేషన్ లో పడాల్సిందే. ఉండేది. సుకుమార్ కూడా చాలా సార్లు నేను శరీరం… దేవీ నా ఆత్మ అని చెప్పాడు. సుకుమార్ డైరెక్ట్ చేసిన సినిమాలే కాదు… సుకుమార్ తన శిష్యులతో చేస్తున్న సినిమాలకు కూడా దేవిశ్రీనే మ్యూజిక్ డైరెక్టర్ గా పెడుతున్నాడు. తాను రైటింగ్ చేసిన , ప్రొడ్యూస్ చేసిన సినిమాలకు కూడా దేవీశ్రీనే బాణీలు సమకూర్చుతున్నాడు.
అటు దేవిశ్రీ ప్రసాద్ కూడా సుకుమార్ సినిమాలు అంటే ప్రాణం పెట్టి మ్యూజిక్ ఇచ్చేవాడు. కొత్త రాగాలు వెతికి మరీ సినిమాను సక్సెస్ చేసేవాడు. అప్పటి ఆర్య నుంచి ఇప్పటు పుష్ప2 వరకూ వీరి బంధం నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం ఓ చిన్న విషయంలో వీరి మధ్య చిన్న అభిప్రాయ బేధాలు వచ్చాయంటున్నారు సినిమా జనాలు. వీరి మధ్య గ్యాప్ మొదలైందన్న గుసగుసటాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏ విషయంలో వీరికి చెడిందో తెలుసా..?
తాజాగా సుకుమార్ రైటింగ్స్లో సుకుమార్ సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమా మొదలు పెట్టారు. సుక్కు శిష్యుడు కార్తీక్ డైరెక్టర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. అయితే ఈసినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అన్నీ సుకుమారే చేస్తున్నారు. ముందుగా మ్యూజిక్ కూడా దేవిశ్రీయే అనుకున్నారు. అయితే ఎందుకో ఏమో.. ఇప్పుడు ఆయన ప్లేస్ లో .. అంజనీష్ లోక్నాథ్ అనే మరో మ్యూజిక్ డెరెక్టర్ వచ్చి చేరాడు. దాంతో టాలీవుడ్ అంతా ఏంటా విచిత్రం అని ఇంట్రెస్ట్ గా గమణించడం మొదలు పెట్టింది. అసలు కారణం ఏంటీ అని ఆరాలు తీయడం స్టార్ట్ చేశారు సినీ జనాలు.
అందరూ కలిసి అసలు కారణం ఏంటీ అని ఆరా తీస్తే..? అప్పుడు బయటకు వచ్చిందట అసలు కదా. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కాని.. రెమ్యూనరేషన్ విషయంలో వీరి మధ్య చిన్న గ్యాప్ వచ్చిందట. అందుకే సుకుమారే కావాలని దేవిశ్రీని పక్కన పెట్టేశాడంటున్నారు. సుక్కు సిఈ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ ఏకంగా 4 కోట్ల రెమ్యునరేషన్ అడిగాడట. ఈ సినిమాకు అంత బడ్జెట్ ఇవ్వలేనని సుక్కు చెప్పేశాట. రెండు కోట్ల వరకూ తగ్గించాలని అడిగాడట. వీరి మధ్య చిన్న గ్యాప్ వచ్చినట్టు తెలుస్తోంది.
మెగా మేనల్లుడు సాయిధరమ్ హిట్ కొట్టి చాలా రోజులు అయ్యింది. మనోడికి ప్రస్తుతం అంత మార్కెట్ కూడా లేదు. దాంతో చాలా తక్కువ బడ్జెట్ లో సినిమాను కంప్లీట్ చేయాలని చూస్తున్నాడట సుక్కు. అందుకే ఈ సినిమా వరకూ విరికి గ్యాప్ తప్పలేదని తెలుస్తోంది. అయితే మరో మాట ఏమి వినిపిస్తుందంటే.. ఇందరి మధ్య అండస్ట్రాండింగ్ తోనే ఈ మూవీ నుంచి దేవిశ్రీ పక్కకు వెళ్ళిపోయాడు అంటున్నారు. అంతే కాదు పుష్ప2 కోసం ఇంకా గట్టిగా పనిచేయాలని దేవిని సుక్కు కోరాట. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి మరి.