బూర్జ్ ఖలీఫాపై స్క్రీన్ షో చేసిన తొలి సినిమా సుదీప్ `విక్రాంత్ రానా`.. మూడు నిమిషాలకు అంత ఖరీదా?
సూపర్ స్టార్గా రాణిస్తున్న సుదీప్ ప్రస్తుతం `విక్రాంత్ రానా` చిత్రంలో నటిస్తుంది. తన 25ఏళ్ల జర్నీని తెలిపేలా, ఈ చిత్ర టైటిల్ లోగోని డిఫరెంట్గా ప్లాన్ చేశారు. నిన్న ఆదివారం దుబాయ్లో అత్యంత ఎత్తైన భవనంగా ప్రపంచం రికార్డ్ సృష్టించిన బూర్జ్ ఖలీఫా పై స్క్రీన్ షో ద్వారా టైటిల్ లోగోని రివీల్ చేశారు.
తెలుగులో `ఈగ`, `బాహుబలి` చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు `కిచ్చ` సుదీప్. కన్నడలో సూపర్ స్టార్గా రాణిస్తున్న ఈయన తెలుగులోనూ భారీ సినిమాల్లో మెప్పిస్తున్నారు. మొదటిసారి `రక్తచరిత్ర`లో కనిపించారు. ఆ తర్వాత `ఈగ` చిత్రంలో విలన్గా సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని విజయతీరానికి చేర్చారు. `బాహుబలి`లో అస్లామ్ ఖాన్గా కాసేపు మెరుపులు పంచారు.
ఇటీవల చిరంజీవి నటించిన `సైరా నరసింహారెడ్డి`లో అవుకు రాజుగా తనదైన నటనతో మెప్పించారు. తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యారు. ఇదిలా ఉంటే సుదీప్ నటుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 25ఏళ్లు అవుతుంది. 1997లో `తయవ్వ` చిత్రంతో నటుడిగా మారారు. అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు. హీరోగా తన స్టామినా చాటుకున్నారు. అదే సమయంలో విలక్షణ నటుడిగా మెప్పిస్తున్నారు. విలన్గా, బలమైన పాత్రల్లో నటిస్తూ తన సత్తా చాటుతున్నారు.
సూపర్ స్టార్గా రాణిస్తున్న సుదీప్ ప్రస్తుతం `విక్రాంత్ రానా` చిత్రంలో నటిస్తుంది. తన 25ఏళ్ల జర్నీని తెలిపేలా, ఈ చిత్ర టైటిల్ లోగోని డిఫరెంట్గా ప్లాన్ చేశారు. నిన్న ఆదివారం దుబాయ్లో అత్యంత ఎత్తైన భవనంగా ప్రపంచం రికార్డ్ సృష్టించిన బూర్జ్ ఖలీఫా పై స్క్రీన్ షో ద్వారా టైటిల్ లోగోని రివీల్ చేశారు. మూడు నిమిషాల నిడివి గల వీడియోని ఈ మేరకు విడుదల చేశారు. ఇందులో బూర్జ్ ఖలీఫాపై స్క్రీన్ షో ద్వారా సుదీప్ కెరీర్ని, ఆయన జర్నీని ప్రతిబింబించారు. ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో విడుదల చేసిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది.
ఇక ఈ చిత్రానికి అనూప్ భండారి దర్శకత్వం వహిస్తుండగా, నీతా అశోక్ హీరోయిన్గా నటిస్తుంది. నిరూప్ భండారీ కీలక పాత్ర పోషిస్తున్నారు. బూర్జ్ ఖలీఫాపై ఇలా స్క్రీన్ షో ద్వారా టైటిల్ లోగో విడుదల చేసిన తొలి సినిమాగా ఇది ప్రపంచ రికార్డ్ ని క్రియేట్ చేసింది. అంతేకాదు కోవిడ్ కాలంలో ఇంత భారీ బడ్జెట్తో రూపొందించిన చిత్రంగానూ ఇది రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఇదిలా ఉంటే బూర్జ్ ఖలీఫాపై స్క్రీన్షో చేయడానికి ఎంత ఖర్చు చేశారో తెలిస్తే మాత్రం మతిపోవాల్సిందే. ఆదివారం సాయంత్రం టైమ్ కావడంతో దీనికి దాదాపు రెండు కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.