గుడ్న్యూస్ చెప్పిన స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్.. బేబీ శ్రేయాదిత్య కోసం వెయిటింగ్..
పాపులర్ సింగర్ శ్రేయా ఘోషల్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ ఇంట్లోకి త్వరలో మూడో వ్యక్తి రాబోతున్నారు. ఆమె ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయ్యారు. ఈ విషయాన్ని శ్రేయా ఘోషల్ తాజాగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
పాపులర్ సింగర్ శ్రేయా ఘోషల్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ ఇంట్లోకి త్వరలో మూడో వ్యక్తి రాబోతున్నారు. ఆమె ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయ్యారు. ఈ విషయాన్ని శ్రేయా ఘోషల్ తాజాగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తన ఆనందాన్ని పంచుకుంది. `బేబీ శ్రేయాదిత్య రాబోతున్నారు. ఈ విషయాన్ని మీతో పంచుకునేందుకు శిలాదిత్య, నేను చాలా థ్రిల్ అవుతున్నాం. మా జీవితంతో కొత్త ఆధ్యాయానికి ప్రిపేర్ కావడానికి మీ అందరి ప్రేమ, బ్లెస్సింగ్స్ కావాలి` అని శ్రేయా ఘోషల్ ట్వీట్ చేసింది.
ఈ సందర్బంగా గర్భంతో ఉన్న తన ఫోటోని పంచుకుంది. దీనికి అభిమానులు, సినీ వర్గాలు స్పందిస్తూ, ఆమెకి అభినందనలు తెలియజేస్తున్నారు. ఇండియన్సింగర్గా రాణిస్తున్న శ్రేయా ఘోషల్ సింగర్గా నాలుగు జాతీయ అవార్డులందుకున్నారు. వెస్ట్ బెంగాల్ కి చెందిన ఈ అందాల సింగర్ బిజినెస్ మ్యాన్ అయిన శిలాదిత్యని 2015లో వివాహం చేసుకుంది. ఆరేళ్ల తర్వాత వీరి జీవితంలోకి మూడో వ్యక్తికి చోటు కల్పించారు. తమకు పుట్టబోయే బిడ్డ కోసం ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నట్టు తెలిపారు. ఇటీవల `ఉప్పెన` చిత్రంలో `జల జల జలపాతమ్.. `అనేపాటని ఆలపించారు. ప్రస్తుతం `టక్ జగదీష్`లో ఇంకోసారి.. ఇంకోసారి` అనే పాటని ఆలపించారు.