ఇండియాలో అత్యధిక ధనవంతుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ హోమ్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. అంటిళ్ల అని పిలవబడే ఆ హోమ్ వరల్డ్ లోనే అత్యధిక ఖరీదైన ఇళ్లల్లో రెండవది.
ఇండియాలో అత్యధిక ధనవంతుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ హోమ్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. అంటిళ్ల అని పిలవబడే ఆ హోమ్ వరల్డ్ లోనే అత్యధిక ఖరీదైన ఇళ్లల్లో రెండవది. అయితే ఈ హోమ్ లో ఇప్పుడు రీ డిజైనింగ్ పనులు జరుగుతున్నాయి.
Add Asianetnews Telugu as a Preferred Source

అందుకోసం నీతా అంబానీ స్పెషల్ గా షారుక్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ ని పిలిపించింది. గౌరీ ఇంటీరియర్ డిజైనర్ అని చాలా తక్కువ మందికి తెలుసు. చాలా మంది సెలబ్రేటిస్ హోమ్స్ కి ఆమె సలహాలు సూచనలు ఇస్తుంటారు. ఇక అంబానీ ఫ్యామిలీతో షారుక్ ఫ్యామిలీకి గత కొన్నేళ్ల నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది.
ఇక ఇప్పుడు అంబానీ అంటిళ్లలో కొన్ని ఫ్లోర్స్ కి గౌరీ ఖాన్ డిజైన్స్ సెట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గౌరీ ఖాన్ కి ముంబైలో ఇంటీరియర్ వర్క్స్ కి సంబందించిన హై ఫై స్టోర్ కూడా ఉంది.
