Asianet News TeluguAsianet News Telugu

సోషల్‌ మీడియాకి స్టార్‌ డైరెక్టర్‌ గుడ్ బై.. అనుబంధంలో మార్పుండదంటూ..

సోషల్‌ మీడియాకి స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ గుడ్‌ బై చెప్పారు. సోషల్‌ మీడియా నుంచి వెళ్లాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఈ మేరకు కొరటాల శివ ట్విట్టర్‌ ద్వారా ఓ పోస్ట్ ని పంచుకున్నారు. 

star director koratala siva move away from social media  arj
Author
Hyderabad, First Published Jun 25, 2021, 7:43 PM IST

సోషల్‌ మీడియాకి స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ గుడ్‌ బై చెప్పారు. సోషల్‌ మీడియా నుంచి వెళ్లాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఈ మేరకు కొరటాల శివ ట్విట్టర్‌ ద్వారా ఓ పోస్ట్ ని పంచుకున్నారు. మీడియం మారింది. కానీ మన మధ్య ఉన్న అనుబంధం మారదని వెల్లడించారు. 

ఆయన చెబుతూ, `నా సినిమా, నాకు సంబంధించిన విషయాలను సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ వేదికగా ప్రేక్షకులతో పంచుకున్నా. ఇకపై సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నా. దూరంగా ఉండాల్సిన సమయం వచ్చింది. మీడియా ద్వారా అందరికీ అందుబాటులో ఉంటా. మీడియం మారింది కానీ మన మధ్య ఉన్న అనుబంధంలో ఎలాంటి మార్పు ఉండదు` అని పేర్కొన్నాడు కొరటాల శివ. 

ట్విట్టర్‌తోపాటు ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి కూడా ఆయన వెళ్లిపోతున్నట్టు ప్రకటించారు. ఉన్నట్టుండి కొరటాల శివ ఎందుకు సోషల్‌ మీడియా నుంచి వెళ్లిపోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదొక కొత్త చర్చకు తెరలేపుతుంది. నెటిజన్ల నుంచి వచ్చే కామెంట్లే కారణమా? లేక వరుసగా సినిమాలతో బిజీ అయ్యే క్రమంలో సోషల్‌ మీడియాని హ్యాండిల్‌ చేయలేకపోతున్నాడా? అన్నది సస్పెన్స్ గా మారింది. 

ప్రస్తుతం కొరటాల శివ.. చిరంజీవితో `ఆచార్య` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా త్వరలో షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. దీని తర్వాత ఆయన ఎన్టీఆర్‌తో `ఎన్టీఆర్‌30` చేయబోతున్నారు. అలాగే అల్లు అర్జున్‌తోనూ ఓ సినిమా లైన్‌లో ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios