SSMB28 రిలీజ్ డేట్ ఫిక్స్.. పొయిపొయి ప్రభాస్తో మహేష్ ఢీ.. వచ్చే సంక్రాంతికి రణరంగమే!
సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ వచ్చింది. వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు తాజాగా యూనిట్ ప్రకటించింది.
మహేష్బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా `ఎస్ఎస్ఎంబీ28`. ఈ సినిమాకి అనేక రకాల టైటిల్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే శ్రీరామనవమి సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారనే వార్తలు వచ్చాయి. అలాగే రిలీజ్ డేట్పై కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపై క్లారిటీ రానుందని అంతా భావించారు. కానీ మహేష్ ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది యూనిట్. ఈ సినిమా రిలీజ్ డేట్ని ఆదివారం సాయంత్రం ప్రకటించారు. ఫ్యాన్స్ డిమాండ్ మేరకు రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు. వచ్చే(2024) సంక్రాంతికి బరిలోకి దించుతున్నట్టు ప్రకటించారు. సంక్రాంతి 13న విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.
తాజాగా రిలీజ్ డేట్ని ఖరారు చేస్తూ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఇందులో మహేష్ లుక్ అదిరిపోయింది. గతంలో మాదిరిగా త్రివిక్రమ్ సినిమాలో హీరోలా క్లాస్గా కాకుండా ఇందులో ఊరమాస్ లుక్లో కనిపిస్తున్నారు మహేష్. సిగరేట్ తాగుతూ రోడ్డుపై స్టయిల్గా నడుచుకుంటూ వస్తున్న లుక్ వాహ్ అనిపిస్తుంది. ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా ఉంది. దీనికితోడు వెనకాల లారీ, సైడ్లో కారు, పైకి ఎర్రనీ మిర్చీ ఎగురుతుండగా టోటల్గా ఫస్ట్ లుక్ మాస్గా అదిరిపోయేలా ఉంది. దీంతో ప్రస్తుతం ఈ లుక్ని ట్రెండ్ చేస్తున్నారు సూపర్స్టార్ ఫ్యాన్స్. ఓ రకంగా సంబరాలు ప్రారంభించారు.
ఇదంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు రిలీజ్ డేటే హాట్ టాపిక్గా మారింది. వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు ప్రకటించడం చర్చనీయాంశం అవుతుంది. సంక్రాంతికి రాబోతున్నట్టు ఇప్పటికే ప్రభాస్ `ప్రాజెక్ట్ కే`ని ప్రకటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. గత నెలలోనే ఈ రిలీజ్ డేట్ని కన్ఫమ్ చేశారు. ఇప్పుడు మహేష్ సినిమా `ప్రాజెక్ట్ కే`కి రెండు రోజుల గ్యాప్తో వస్తుండటం విశేషం. అయితే సంక్రాంతికి రెండు మూడు సినిమాలు ఆడే అవకాశం ఉంది. బాగుంటే ఆడుతాయి కూడా. కానీ ఓ భారీ పాన్ ఇండియా మూవీ, భారీ బడ్జెట్ మూవీ, మరో భారీ సినిమాతో పోటీ అంటే కలెక్షన్ల విషయంలో గట్టి దెబ్బ పడే ఛాన్స్ కూడా ఉంటుంది. అది ప్రభాస్ సినిమాకి దెబ్బే అని చెప్పడటంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు మహేష్ సినిమాని కూడా పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్టు టాక్.
ఇప్పటి వరకు ప్రభాస్, మహేష్ బాక్సాఫీసు పోటీ పడింది లేదు. కానీ ఇప్పుడు సంక్రాంతికి ఈ ఇద్దరు పోటీ పడుతుండటంతో ఇక బాక్సాఫీసు రణరంగమే అంటున్నారు నెటిజన్లు. మొత్తంగా ఈ వార్త అటు ఫ్యాన్స్ లోనూ, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. హీటుని పెంచుతుంది. ఇక మహేష్బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న `ఎస్ఎస్ఎంబీ28` చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీలా కథానాయికలుగా నటిస్తున్నారు. హారికా అండ్ హాసినీ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రానిక `అర్జునుడు`, `అయోధ్యలో అర్జునుడు` వంటి టైటిల్స్ వినిపిస్తున్నాయి.
సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే. ఎడిటర్ గా జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి , కళా దర్శకునిగా ఎ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రాహకుడు గా పి.ఎస్.వినోద్ వ్యవహరిస్తున్నారు.
తారాగణం: మహేష్ బాబు, పూజా హెగ్డే, శ్రీలీల
రచన, దర్శకత్వం: త్రివిక్రమ్
నిర్మాత: ఎస్.రాధాకృష్ణ(చినబాబు)
సంగీతం: తమన్
డీఓపీ: పి.ఎస్.వినోద్
ఆర్ట్ డైరెక్టర్: ఎ.ఎస్. ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి