టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమల్లో... అలనాటి అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి అంటే యమా క్రేజ్. శ్రీదేవి బోనీకపూర్ లకు ఇద్దరు కూతుళ్లు. ఇప్పుడు ఇద్దరు కుమార్తెల్లో... పెద్ద కూతురు జాహ్నవి వ్యవహారం శ్రీదేవికి తలనొప్పిగా మారింది. బాలీవుడ్ మూవీస్ లో గ్రాండ్ ఎంట్రీ ఇప్పిద్దామని, తల్లి శ్రీదేవి ప్లాన్ చేస్తుంటే... జాహ్నవి మాత్రం ఎంచక్కా డేటింగ్ లు... చాటింగ్ లు అంటూ ఎంజాయ్ చేస్తోంది. దీంతో విసిగిపోయింది శ్రీదేవి.

శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవి రచ్చ రచ్చ చేస్తోంది. విదేశాల్లో యాక్టింగ్ నేర్చుకోమని పంపిస్తే ఈ అమ్మడు ప్రేమాయణాలు, డేటింగ్ లు చేస్తూ న్యూస్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈమె రొమాంటిక్ ఫోటోలు బాలీవుడ్ ని ఊపేస్తున్నాయి. జాహ్నవిని హీరోయిన్ గా పరిచయం చేయాలనీ ప్లాన్ చేస్తున్న శ్రీదేవికి .. తన కూతురు వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. జాహ్నవి డేటింగ్ విషయం బయట పడటంతో అవకాశాలు రావట్లేదట.

ఇప్పటికే జోరుగా డేటింగ్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ భామ సినిమాల్లో ఏం నటిస్తుంది అని వాళ్ళు వీళ్లు అంటున్నారు. దాంతో విసిగి వేసారిన శ్రీదేవి.. తన కూతురుకి గట్టిగానే క్లాస్ పీకిందట.. ఇకపై డేటింగ్ గీటింగ్ అంటూ తిరిగితే కాళ్లు చేతుల విరగ్గొట్టి రూంలో పడేస్తానని కాస్త సీరియస్ గానే చెప్పిందట.!! ఇంతకీ జాహ్నవి డేటింగ్ చేస్తున్నది ఎవరితోనో తెలుసా... ఎవరో కాదు మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో. మరి తల్లి చెప్పినట్టుగా జాహ్నవి మనసు మార్చుకుంటుందో లేక వదులుకోలేక అతనితో చెక్కేస్తుందో మరి.