కుమార్తె ప్రేమను అంగీకరించిన శ్రీదేవి పబ్లిక్ గానే ఒకే కార్ లో తల్లీ కూతుళ్లు, మామా అల్లుడు

అతిలోక సుందరి శ్రీదేవి తన కూతురు జాహ్నవిని ఎప్పుడెప్పుడు సినిమాలో చూపిస్తుందా అని అంతా ఎదురు చూస్తున్న తరుణంలో ఊహించని పరిణామం జరిగింది. జాహ్నవి ప్రేమకు శ్రీదేవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స్పష్టమైంది. దీంతో జాహ్నవి సినిమాల్లో నటిస్తుందా... లేక పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటుందా.. లేక ప్రియుడి అంగీకారంతో సినిమాల్లో నటిస్తుందా అర్థంకాక అభిమానులు కన్ ఫ్యూజ్ అవుతున్నారు.

లవ్వు గివ్వు అంటూ తిరగొద్దని, బుద్ధిగా కెరీర్ పై దృష్టి పెట్టాలని.. తన పెద్ద కుమార్తె జాహ్నవీ కపూర్‌కి నటి శ్రీదేవి వార్నింగ్ ఇచ్చిందనే వార్త ఈ మధ్య హల్‌చల్ చేసింది. అయితే.. ఆ వార్త తప్పని రుజువు చేస్తూ.. జాహ్నవి తల్లితండ్రులు శ్రీదేవి, బోనీకపూర్ లను జాహ్నవి ఒప్పించినట్లు రుజువైంది. మొత్తం మీద తన బాయ్‌ఫ్రెండ్, మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ రాజకీయ నేత సుశీల్‌కుమార్ షిండే మనవడు, శిఖర్ పహారియాను పేరెంట్స్‌ కి దగ్గర చేసినట్లు కనిపిస్తోంది.

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, ఆలియా భట్ నటించిన ‘డియర్ జిందగీ’ చిత్రం స్పెషల్ స్క్రీనింగ్‌కు అమ్మానాన్న, లవర్ శిఖర్‌తో కలిసి ఒకే కారులో జాహ్నవి హాజరు కావడం అందరి దృష్టినీ ఆకట్టుకుంది. ఒక్కసారిగా కెమెరాలన్నీ వాళ్లపై ఫోకస్ అయ్యాయి. ఇప్పుడీ ఫొటోలు ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారాయి. దీంతో జాహ్నవి, శిఖర్‌ల ప్రేమకు బోనీ, శ్రీదేవి ఒప్పుకున్నట్లేననే చర్చ మొదలైంది. ఇప్పుడు బాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్.