త్రివిక్రమ్ తీస్తున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయనున్నారు.   మూవీలో శ్రీలీల దుమ్ము రేపనుంది. అయితే..

మ‌హేష్‌బాబు (Mahesh Babu) తాజా చిత్రం గుంటూరు కారం రోజుకో అప్డేట్ తో నిరంతరం వార్తల్లో ఉంటోంది. ఈ సినిమా నుంచి పూజాహెగ్డేతో పాటు సినిమాటోగ్రాఫ‌ర్స్ అర్ధాంత‌రంగా వైదొల‌గ‌డం, షూటింగ్ ప‌లుమార్లు పోస్ట్‌పోన్ అవుతోండ‌టం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపధ్యంలో  ఓ టైమ్ లో అసలు ఈ  సినిమా షూటింగ్ ముందుకు కొన‌సాగుతుందా? మ‌ధ్య‌లోనే ఆగిపోతుందా? అన్న‌ది స‌స్పెన్స్‌ కు రీసెంట్ గా తెరపడింది. వెకేషన్ నుంచి వచ్చిన మహేష్ జాయిన్ కావటంతో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. అయితే అసలైన సస్పెన్స్ ఇప్పుడే మొదలైంది. 

స్పీడుగా షెడ్యూల్స్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ ఓ ప్రక్కన షూటింగ్ తో పాటే లాగేస్తూ సంక్రాంతికి రిలీజ్ పెట్టాలనేది టీమ్ ప్లాన్. అయితే షెడ్యూల్స్ కాన్సిల్ అవటంతో ఇప్పుడు చాలా మంది క్యారక్టర్ ఆర్టిస్ట్ లు డేట్స్ సమస్యగా మారాయని తెలుస్తోంది. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంటే ఫామ్ లో ఉండే ఆర్టిస్ట్ లనే చిన్న క్యారక్టర్ కి సైతం తీసుకుంటారు. అలా వాళ్ల డేట్స్ ఎడ్జెస్ట్ చేయటం,కాంబినేషన్ సీన్స్ ప్లాన్ చేయటం  ప్రొడక్షన్ కు పెద్ద సమస్యగా మారిందిట. అందులో త్రివిక్రమ్ సినిమాల్లో ఉండే ఫ్యామిలీ సీన్స్ కు జనం బాగా కావాలి. అక్కడితో సరిపడలేదు కమిడియన్స్ ది అదే పరిస్దితి అంటున్నారు. సరే అవన్నీ ఎలాగోలా మ్యానేజ్ చేద్దామనుకున్నా అసలైన సమస్య శ్రీలీల దగ్గర వచ్చి పడిందని సమాచారం. 

ఎందుకంటే శ్రీలల వరస సినిమాలతో బిజిగా ఉంది. గతేడాది 'ధమాకా'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రీలీల.. ప్రస్తుతం అరడజనుకి పైగా సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ మోస్ట్ బిజీయెస్ట్ బ్యూటీ అయిపోయింది. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో తీస్తున్న 'గుంటూరు కారం'లోనూ శ్రీలీల వన్ ఆఫ్ ది హీరోయిన్. పెద్ద హీరోలందరి సినిమాల్లో దాదాపు ఉంది. దాంతో ఒక్కసారి ఆమె డేట్స్ కనుక ఉపయోగించుకోకపోతే మరోసారి దొరకటం కష్టంగా మారిందని చెప్తున్నారు. శ్రీలీల బల్క్ డేట్స్ పట్టుకోవటమే ఈ సినిమా టీమ్ ముందున్న పెద్ద ఛాలెంజ్ గా వినపడుతోంది.