అదిరిపోయిన ‘రామరావు ఆన్ డ్యూటీ’ స్పెషల్ సాంగ్.. మతిపోగొడుతున్న బాలీవుడ్ బ్యూటీ అన్వేషి జైన్..
మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘రామా రావు ఆన్ డ్యూటీ’ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి స్పెషల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు.
టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనాకు ముందుకు కాస్తా వెనకంజలో నడిచినా.. ప్రస్తుతం మాస్ పవర్ చూపిస్తున్నాడు రవితేజ. వరుస చిత్రాలతో ఆడియెన్స్ ను, ఆయన అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నారు. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన ‘క్రాక్’తో సాలిడ్ హిట్ అందుకుని, ఆ తర్వాత ‘ఖిలాడీ’తోనూ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ రిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.
ఎట్టకేళకు జూలై 29న Rama rao On Duty థియేటర్ లో సందడి చేయనుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రచార కార్యక్రమాలను షురూ చేశారు. గతంలో మూవీ నుంచి రెండు పాటలను వదలగా.. తాజాగా స్పెషల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ‘నాపేరు సీసా’ అనే టైటిల్ తో ఈ స్పెషల్ సాంగ్ ఇంటర్నెట్ లో దూసుకుపోతోంది. ఈ మాస్ నెంబర్ కు లిరిసిస్ట్ చంద్ర బోస్ సాహిత్యం అందించారు. శ్రియా గోషల్ గాత్రదానం చేశారు. సాయ్ సీఎస్ మేల్ వాయిస్ ను అందించడంతో పాటు అద్భుతమైన ట్యూన్ ను కంపోజ్ చేశారు. ఫుల్ సాంగ్ ను జూలై 2న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
అయితే ఈ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ అన్వేషి జైన్ అందాలు ఆరబోసింది. ఈ హీరోయిన్ బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇటీవల వచ్చిన హిందీ వెబ్ సిరీస్ ‘గంధీ బాత్ 2’లో బోల్డ్ గా నటించి పాపులర్ అయ్యింది. ఇక ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాకు శరత్ మండవ దర్శకత్వం వహించారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్, ఆర్టీ టీం వర్క్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అదే విధంగా ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ చేయనున్నట్టు తెలుస్తోంది. మూవీతోనే వేణు తొట్టెంపూడి కూడా రీఎంట్రీ ప్లాన్ చేశారు మేకర్స్. రవితేజకు జోడీగా ‘జై భీం’ ఫేమ్ రజిషా విజయన్ (Rajisha Vijayan) నటిస్తోంది. పలు కీలక పాత్రల్లో నాజర్, నరేష్, పవిత్రా లోకేష్, తనికేళ్ల భరణి, రాహుల్ రామక్రిష్ణ, సురేఖ వాణి కనిపించనున్నారు.