ఇంతకీ అసలు సంగతేమిటంటే ...

ప్రభాస్‌ ‘సాహో’ కోసం దుబాయ్‌కి వెళ్ళిన సంగతి తెలిసిందే . అక్కడ షూటింగ్‌లో ఒకటిరెండు సార్లు గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న అనుష్క అర్జంటుగా దుబాయ్‌కి వెళ్ళిపోయింది. అక్కడ ప్రభాస్‌కి గంటకు పైగా క్లాసు తీసుకుందట రిస్కీ ఫైట్ల షూటింగ్‌ సమయంలో డూప్‌ని పెట్టుకోమంటూ గట్టిగా చెప్పిందట! అనుష్క చెప్పిందంతా బుద్ధిగా విన్న ప్రభాస్‌ అలాగే డూప్‌ని పెట్టుకుంటానంటూ అనుష్కకు వాగ్దానం చేశాడట .ప్రభాస్ మీద అంత శ్రద్ధ తీసుకోవడంతో సోషల్ మీడియాలో విసృతంగా చర్చ జరుగుతోంది. అసలు వీళ్లిద్దరి మధ్య ఏం జరుగుతోంతో వీళ్లకే తెలియాలి ..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred