మెగా హీరో ధైర్యం చేశాడు.. థియేటర్లోనే రాబోతున్నాడు!
ప్రస్తుతం సాయితేజ్ `సోలో బ్రతుకే సో బెటర్` అనే చిత్రంలో నటిస్తున్నాడు. సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు థియేటర్లు ఓపెన్ కావడంతో తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు.
కరోనా కారణంగా సినిమాల విడుదల ఆగిపోయాయి. థియేటర్లు సైతం మూత పడటంతో ఇన్నాళ్ళు వెయిట్ చేశారు. ఇక ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం థియేటర్ల ఓపెన్కి అనుమతినిచ్చింది. గత వారమే థియేటర్లు ఓపెన్ కావాల్సి ఉంది. కానీ ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ ధైర్యం చేశాడు. తన సినిమాని ఓటీటీలో కాకుండా థియేటర్లోనే విడుదలకు సిద్దమయ్యాడు.
ప్రస్తుతం సాయితేజ్ `సోలో బ్రతుకే సో బెటర్` అనే చిత్రంలో నటిస్తున్నాడు. సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు థియేటర్లు ఓపెన్ కావడంతో తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. డైరెక్ట్ గా ఇక థియేటర్లోనే విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని ప్రకటించారు.
డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా సినిమాని విడుదల చేయబోతున్నట్టు నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, హీరో సాయితేజ్ అధికారికంగా ప్రకటించారు. థియేటర్లో సందడి చూసేందుకు ఈగర్గా వెయిట్ చేస్తున్నట్టు సాయితేజ్ తెలిపారు. ఈ లెక్కన థియేటర్లో వచ్చే మొదటి పెద్ద సినిమా ఇదే కానుందని చెప్పొచ్చు.