మోసం చేశానని నిరూపిస్తే.. గుండు కొట్టించుకుంటా: నటుడి సంచలన వ్యాఖ్యలు!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా శివాజీరాజా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతేడాది ఎన్నికల్లో ఆయన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నారు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా శివాజీరాజా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతేడాది ఎన్నికల్లో ఆయన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నారు. అయితే రెండు రోజుల కృష్ణ శివాజీరాజా ఆర్టిస్టుల సంఘం డబ్బుని తన వ్యక్తిగత వ్యాపకాల కోసం ఖర్చు చేసుకుంటున్నారని.. దీంతో 'మా' కార్యకలాపాల్ని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీనియర్ నరేష్ తీసుకున్నారని వార్తలు వచ్చాయి.
అంతేకాదు. మా ఫండ్ అసోసియేషన్ కి సంబంధించిన కొన్ని రికార్డులు మిస్ అయ్యాయని, 2017 ఫైల్స్ కనిపించడం లేదని, కొన్ని వీడియోలు కూడా మిస్ అయ్యాయని వార్తలు బయటకి వచ్చాయి. దీనిపై స్పందించిన శివాజీరాజా, మా అసోసియేషన్ సభ్యులు ఈ వార్తలను ఖండించారు.
''మా అసోసియేషన్ లో ఎలాంటి విబేధాలు లేవు.'మా' లో గతేడాది వరకు 2 కోట్ల 10 లక్షలు విరాళాలు ఉంటే ఈ ఏడాదికి ఆ నెంబర్ 5.50 కోట్లకు చేరుకుంది. 10 కోట్లు అవ్వగానే అసోసియేషన్ కోసం ఓ భవంతి కట్టాలనేది మా ప్లాన్'' అంటూ పరుచూరి వెంకట్రావు అన్నారు. ''మెగాస్టార్ చిరంజీవి గారు రెండు కోట్ల విరాళాన్ని మా అసోసియేషన్ కోసం ప్రకటించారు. ఇప్పటికే కోటి రూపాయలు ఇచ్చేశారు'' అంటూ నటుడు శ్రీకాంత్ అన్నారు.
''20 ఏళ్లుగా ఈ అసోసియేషన్ లో ఉన్నాను. నా మీద నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 5 పైసలు కూడా నేను ఎప్పుడూ మిస్ యూజ్ చేయలేదు. అలా జరిగిందని నిరూపిస్తే.. గుండు కొట్టించుకొని ఇక్కడి నుండి వెళ్లిపోతా'' అంటూ నటుడు శివాజీరాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.