Asianet News TeluguAsianet News Telugu

ఎస్పీ బాలు నాకు తండ్రిలాంటి వారు.. సింగర్‌ మనో ఎమోషనల్‌

బాలు(sp balu) ప్రస్తుతం మన మధ్యలేకపోయినా తన పాటలతో ఎప్పటికీ జీవించే ఉంటారు. శ్రోతల మదిలో నిద్రపోతూనే ఉంటారు. బాలు మరణించి ఏడాది అయిన సందర్భంగా మరో గాయకుడు, నటుడు నాగూర్‌బాబు(మనో)(mano) ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

singer mano emotional on remembering sp balu death anniversary
Author
Hyderabad, First Published Sep 25, 2021, 10:30 AM IST

గాన గాంధర్వుడు ఎస్పీ బాలు(sp balasubramaniam) చనిపోయి ఏడాదవుతుంది. నెల రోజులపాటు కరోనా(corona)తో పోరాడి, చివరికి ఓడిపోయారు. కరోనా నుంచి కోలుకుని మరీ లంగ్స్ ఇన్‌ఫెక్షన్‌తో చనిపోవడం అందరిని బాధించింది. బాలు మరణం సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసిందనే చెప్పాలి. బాలు ప్రస్తుతం మన మధ్యలేకపోయినా తన పాటల(balu songs)తో ఎప్పటికీ జీవించే ఉంటారు. శ్రోతల మదిలో నిద్రపోతూనే ఉంటారు. బాలు మరణించి ఏడాది అయిన సందర్భంగా మరో గాయకుడు, నటుడు నాగూర్‌బాబు(మనో) ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

బాలుని ఒక్కసారి కలిస్తే ఆయన్ని ఎప్పటికీ మర్చిపోలేరని, అంతటి ఆప్యాయతని చూపిస్తారని తెలిపారు. చిన్న సంగీత దర్శకుడైనా, పెద్ద సంగీత దర్శకుడైనా ఆయన చూపే మర్యాద, వినయ విధేయతల్లో ఏ మాత్రం మార్పు ఉండదు. రికార్డింగ్‌ టైమ్‌కు పావు గంట లేట్‌గా వస్తే సంగీత దర్శకుడికి సారీ చెప్పేవారు. తను పెద్దల దగ్గర నేర్చుకున్నది మనకు నేర్పింది అదే. అహర్నిశలు సాధన చేస్తూ పాటకు జీవంపోస్తూ వచ్చారు. వచ్చే తరంలో కూడా ఇది కంటిన్యూ అవ్వాలన్నారు. 

కరోనా సమయంలో నిత్యావసర వస్తువులు  సేకరించి కర్ణాటక, కేరళ, తమిళనాడులోని 7200మంది సంగీత కళాకారులకు పంపించారని. అందులో మనో కూడా పాల్గొన్నానని తెలిపారు. కరోనాతో ఆసుపత్రికి వెళ్లిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌ అయ్యారు. `మా అందరినీ జాగ్రత్తగా ఉండమని ఆయన ఆస్పత్రికి వెళ్లడం, ఇక అక్కడి నుంచి తిరిగి రాకపోవడం..  అంతా విధి లీల. గతేడాది జులై 20న అనుకుంటా హైదరాబాద్‌ వచ్చానని ఆయన చెప్పారు. అదే ఆఖరి ఫోన్‌కాల్‌ ఆయనతో మాట్లాడింది. దాని తర్వాత 31న చెన్నై బయల్దేరి వచ్చారు. నాలుగు రోజులు ఇంట్లో ఉండి కరోనాతో హాస్పిటల్‌లో చేరారు. హాస్పిటల్‌కు వెళ్లకుండా ఉంటే ఆయన డెఫినెట్‌గా బతికేవారని అందరూ అంటున్నారు. వెళ్లకిపోతే అది మరీ డేంజర్‌గా ఉండేదేమో` అని తెలిపారు.

బాలుది గంధర్వ అంశ అని, పాటనే శ్వాసగా చేసుకొని బతికారని, ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా పాడాక కూడా ఆయన ఫ్రెష్‌గా ఉండేవారని, పాట మీద ఉన్న వ్యామోహమే అందుకు కారణమని, వర్క్‌ శాటిస్‌ఫిక్షన్‌ అనేది ఆయన దగ్గర చాలాకాలం చూశానని తెలిపారు. 

బాలు ఇండస్ట్రీలోకి వచ్చి, సింగర్‌గా కెరీర్‌ ప్రారంభించి 22ఏళ్ల తర్వాత తాను ఇండస్ట్రీలోకి సింగర్‌గా అడుగుపెట్టానని, అప్పుడు తన వయసు కేవలం 14ఏళ్లు అని, కానీ తనని ఎంతో బాగా చూసుకున్నారని తెలిపారు.అందరినీ సమానంగా చూసే మనస్తత్వం ఆయనదన్నారు. గతేడాది జనవరి 20న చివరి ప్రోగ్రామ్‌ కోయంబత్తూరులో చేశారట. `ఇళయరాజాగారితో వివాదం ముగిసిన తర్వాత చేసిన ఐదో ప్రోగ్రామ్‌ ఇది. ఆ రోజు ఆయన స్నేహితుడు అక్కడ ఉన్నాడు. వాళ్లింటికి భోజనం కోసం వెళ్తూ రాత్రి 12 గంటలకు ఆయన రూమ్‌కి వెళ్లాను. అప్పుడు ఆయన హెడ్‌ఫోన్స్‌ పెట్టుకొని పాటను ప్రాక్టీస్‌ చేస్తున్నారు. 

`ఏమిటన్నా ఏదన్నా కొత్త పాట ప్రోగ్రామ్‌లో యాడ్‌ చేస్తున్నారా` అని అడిగాను.  `లేదురా ఈ పాట పాడి 30 సంవత్సరాలు అయింది. జనంలో ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయి కదా. అందుకే ఒకసారి విని ప్రాక్టీసు చేస్తున్నాను` అన్నారు. `నీ డెడికేషన్‌లో 10పర్సంట్‌ ఉన్నా చాలా గొప్ప పొజిషన్‌కి వచ్చేవాళ్లం` అని అంటే నవ్వి `అందరూ చేయాల్రా. పాట మీద మనకున్న ఇష్టాన్ని ప్రదర్శించి... అలాగే పాడడానికి ట్రై చేయాలి కదా. అది ధర్మం కూడా అని అన్నార`ని తెలిపారు మనో. 

ఒక గాయకుడిగా గాక  ఇంట్లో వ్యక్తిలా, సొంత తమ్ముడిలా తనని చూశారని, మంచీ చెడూ అన్నీ నాతో డిస్కస్‌ చేసేవారని, స్ట్రిక్‌గా ఉండే తండ్రి చనిపోతే ముందు బాధ పడినా,  రెండు మూడు నెలలు తర్వాత ఏ కొడుకు అయినా మామూలు అవడానికి ట్రై చేస్తాడు. అదే తండ్రి ఒక స్నేహితుడిలా మెలిగితే ఆయన చనిపోయాక ఒకటి రెండేళ్లకు కానీ మాములు మనిషి కాలేడు. తనకు తండ్రి లాంటి వ్యక్తి బాలుగారని తెలిపారు. 

``సతీ లీలావతి` సినిమాలో కమల్‌హాసన్‌ కోయంబత్తూరు స్లాంగ్‌లో మాట్లాడారు. అది కూడా మన గోదావరి భాషలా ఒక రాగంలో  ఉంటుంది. `ఈ సినిమాకు నేను డబ్బింగ్‌ చెప్పడం కన్నా నాగూర్‌బాబు చెబితేనే అద్భుతంగా ఉంటుంది. వాడు ఆ డ్రామా పండిస్తాడు` అని ప్రొడ్యూసర్స్‌కు బాలు అన్నయ్య చెప్పారు. గోదావరి స్లాంగ్‌ జోడించి ఆ చిత్రంలో కమల్‌గారికి డబ్బింగ్‌ చెప్పాను. అలాగే `బహ్మచారి` చిత్రానికి కూడా. ఈ రెండు చిత్రాల్లో నేను డబ్బింగ్‌ చెప్పడానికి బాలు అన్నయ్యే కారణం` అని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios