Asianet News TeluguAsianet News Telugu

సిద్ధార్థ్ పై అజిత్ అభిమానులు ఫైర్.. కారణమేమిటంటే..?

ఆదివారం నాడు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. 

Siddharth trolls Ajith fan over CSK vs MI in IPL final. Gets trolled back
Author
Hyderabad, First Published May 13, 2019, 3:24 PM IST

ఆదివారం నాడు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇదే మ్యాచ్ సిద్ధార్థ్, అజిత్ అభిమానుల మధ్య గొడవకి కారణమైంది. వివరాల్లోకి వెళితే.. నిన్న జరిగిన ఐపీఎల్ ఫైనల్స్ లో ఒక్క పరుగు తేడాతో ముంబై ఇండియన్స్ గెలుపొందింది.

అయితే దీనిపై చాలా మంది సోషల్ మీడియాలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విమర్శలు చూసిన సిద్ధార్థ్ ట్విట్టర్ ద్వారా బదులిచ్చాడు. నోరు మూసుకొని గేమ్ ని గౌరవించాలని ఘాటుగా స్పందించాడు.  

ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ జరగలేదని, ఇరు జట్ల ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఎంటర్టైన్ చేశారని అన్నారు. అజిత్ ఫోటోని డీపీగా పెట్టుకున్న ఓ అభిమాని కూడా మ్యాచ్ ఫిక్సింగ్ అయిందంటూ ట్వీట్ చేశాడు.

దానికి స్పందించిన సిద్ధార్థ్.. ''మీరు నిజంగా అజిత్ అభిమాని అయితే ఇతరుల హార వర్క్ ని గుర్తించండి.. లేకపోతే అలాంటి వ్యక్తిని రోల్ మోడల్ గా ఎంచుకోవడంలో ఉపయోగం ఉండదని'' అన్నారు. దీంతో అజిత్ అభిమానులు సిద్ధార్థ్ పై మండిపడుతున్నారు. అనవసర వివాదంలోకి తమ అభిమాన హీరోని లాగొద్దంటూ సిద్ధార్థ్ కి వార్నింగ్ లు ఇస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios