ఈ టైటిల్ అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ సోషల్ మీడియాలో డిస్కషన్ గా మారింది.  నెలాఖరు టైటిల్ తో పోస్టర్ రిలీజ్ చేస్తారంటున్నారు.


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లోని 28వ చిత్రాన్ని త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా నుండి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ చిత్రం టైటిల్ ఏంటనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది. అనేక టైటిల్స్ అనుకున్నా మహేష్ కు ఏదీ నచ్చటం లేదు అని వినికిడి. తాజాగా మరో టైటిల్ ని ఈ చిత్రానికి ఫైనల్ చేసారని చెప్పుకుంటున్నారు. అయితే ఆ టైటిల్ విన్నవాళ్లు షాక్ అవుతున్నారు. అసలు ఈ టైటిల్ ఎలా ఫైనలైజ్ చేసారు అంటున్నారు అభిమానులు. ఇంతకీ ఏమిటా టైటిల్ ...

#SSMB28 చిత్రానికి '.'ఊరికి మొనగాడు'..' ఫైనలైజ్ చేసే అవకాసం ఉంది. ఈ టైటిల్ అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ సోషల్ మీడియాలో డిస్కషన్ గా మారింది. నెలాఖరు టైటిల్ తో పోస్టర్ రిలీజ్ చేస్తారంటున్నారు. అయితే మరో రెండు టైటిల్స్ కూడా డిస్కషన్ లో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అడవిలో అర్జునుడు, ఆమె కథ, అమ్మ కథ, అమరావతికి అటు ఇటు లాంటి టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. మరి వీటిలో ఏది ఫైనల్ అవుతుందో వేచి చూడాలి. ఇటీవల ఉగాది కానుకగా సినిమా టైటిల్‌ను ప్రకటిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అది సాధ్యం కాలేదు.

ఇక మహేష్,త్రివిక్రమ్ ముచ్చటగా మూడోసారి వీళ్లిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అతడు, ఖలేజా తర్వాత వీరి కాంబోలో రాబోతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. SSMB28 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకాగ విడుదల చేయనున్నారు మేకర్స్. జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాకు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటిగ్ బాధ్యతలు చూస్తున్నారు. మహేశ్ బాబుకు ఇది 28వ చిత్రం కావడం గమనార్హం. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.