రైతు తన కొడుకుని రైతునెందుకు చేయడు.. ఆలోచింప చేస్తున్న `శ్రీకారం` టీజర్
శర్వానంద్ హీరోగా నటిస్తున్న `శ్రీకారం` చిత్ర టీజర్ విడుదలైంది. సూపర్ స్టార్ మహేష్ ఈ టీజర్ని విడుదల చేశారు. రైతులు, వ్యవసాయం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తాజా టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. టీజర్ ఆలోచింప చేస్తుంది.
`ఒక హీరో తన కొడుకుని హీరోని చేస్తాడు. ఓ డాక్టర్ తన కొడుకుని డాక్టర్ని చేస్తాడు. ఒక ఇంజనీర్ తన కొడుకుని ఇంజనీర్ చేస్తాడు. కానీ రైతు మాత్రం తన కొడుకుని రైతుని చేయడానికి ఇష్టపడడు. ఈ ఒక్కటి నాకు జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోయింది... తినేవాడు మన నెత్తిమీద జుట్టంత ఉంటే.. పడ్డించేవాడు మన మూతి మీద మీసం అంత కూడా లేడు` అని అంటున్నారు హీరో శర్వానంద్. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం `శ్రీకారం`. ఈ చిత్ర టీజర్ని మహేష్బాబు మంగళవారం సాయంత్రం విడుదల చేశారు.
రైతులు, వ్యవసాయం నేపథ్యంలో సాగే ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఆలోచింప చేస్తుంది. రైతు తన కొడుకుని రైతుగా మార్చేందుకు ఎందుకు ఇష్టపడే ప్రశ్న ఆడియెన్స్ ని ఆలోచింప చేస్తుంది. వరిపొలాలు, పంటలు, రైతుల కష్టాలు చూపించారు. రైతు కష్టాలను, వ్యవసాయం గొప్పతనాన్ని చెప్పే విధంగా ఈ సినిమా రూపొందుతుందని టీజర్ని బట్టి అర్థమవుతుంది. ఈ టీజర్ని సూపర్ స్టార్ మహేష్బాబు ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. చిత్ర యూనిట్కి అభినందనలు తెలియజేశారు. కిషోర్.బి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది.