సమంత, శర్వానంద్ జంటగా చిత్రం..దిల్ రాజు ప్రకటన
గత కొద్ది రోజులుగా తమిళ సూపర్ హిట్ ‘96’ తెలుగు రీమేక్లో శర్వానంద్, సమంత జంటగా నటించనున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ విషయం నిజమైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విటర్ ఖాతా ద్వారా ప్రకటించింది. తమ ప్రొడక్షన్లో వస్తోన్న 34వ చిత్రం ఇది అని తెలిపింది. చిత్రానికి సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నట్లు పేర్కొంది. మార్చిలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది.
గత కొద్ది రోజులుగా తమిళ సూపర్ హిట్ ‘96’ తెలుగు రీమేక్లో శర్వానంద్, సమంత జంటగా నటించనున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ విషయం నిజమైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విటర్ ఖాతా ద్వారా ప్రకటించింది. తమ ప్రొడక్షన్లో వస్తోన్న 34వ చిత్రం ఇది అని తెలిపింది. చిత్రానికి సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నట్లు పేర్కొంది. మార్చిలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది.
ప్రముఖ నిర్మాత దిల్రాజు ‘96’ సినిమా తెలుగు రీమేక్ హక్కుల్ని చాలా రోజుల క్రితమే సొంతం చేసున్నారు. ఇన్నాళ్లూ రకరకాల నటులను ఆ పాత్రల కోసం వెతికి, చివరకు శర్వా, సమంతను ఎంచుకున్నారు. తమిళంలో ఈ చిత్రం తీసిన సి. ప్రేమ్ కుమార్ రీమేక్ను కు దర్శకుడుగా ఎంచుకోవటంవిశేషం.
సమంత ఇందులో నటించనున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఆమె ట్విటర్లో స్పందిస్తూ.. ‘త్రిష పాత్రను మరొకరు చేయకూడదు’ అని చెప్పారు. దాంతో సమంత చేయదేమో అనుకున్నారు. కానీ ఫైనల్ గా సమంతనే సీన్ లోకి తెచ్చారు.
ఇక ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసి, ఆగస్టులో తెలుగు రీమేక్ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ‘96’లో త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించారు. గత ఏడాది అక్టోబరులో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల ప్రసంశలూ పొందింది. స్కూల్ డేస్ లో త్రిష, విజయ్ల మధ్య ప్రేమ చిగురించడం.. కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య దూరం పెరగడం.. మళ్లీ ఓ సందర్భంలో కలుసుకోవడం నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు.