శర్వానంద్ ‘రణరంగం’ ట్రైలర్ ఎలా ఉందంటే?
శర్వానంద్ ‘రణరంగం’ ట్రైలర్ వచ్చేసింది. ఈ థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. యథార్థ సంఘటనల ఆధారంగా ఒక కల్పిత కథను తెలుగు ప్రేక్షకులకు వెండితెరపై చూపించబోతున్నారు.
శర్వానంద్ హీరోగా సుధీర్వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రణరంగం’. కాజల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయన్స్ గా చేస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసారు. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని సైతం ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా విచ్చేసి, ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. పూర్తి గా మాస్ లుక్ లో శర్వానంద్ కనపడిన ఈ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.
ఇక ఈ ట్రైలర్ థీమ్.. ఒక సాధారణం వ్యక్తి వ్యవస్దనే శాశించేలా ఒక శక్తిగా ఎలా ఎదిగాడనే విషయం చుట్టూ కథ అల్లి ఈ సినిమాను తెరకెక్కించారు. ఎన్టీఆర్ 1994లో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మద్యనిషేధం విధించిన రోజుల నేపథ్యంలో ఈ సినిమాను విశాఖ పట్నం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. అప్పుడున్న పరిస్దితులను ఆసరా చేసుకుని హీరో లిక్కర్ సామ్రాజ్యానికి అధిపతి ఎలా అయ్యాడు. ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనే దానిపై ఈ సినిమాను తెరకెక్కించినట్టు అర్దమవుతోంది.
అలాగే ఈ ట్రైలర్ చూస్తూంటే.. కమల్ హాసన్ నాయకుడు, ప్రభాస్ ఛత్రపతి, యశ్ KGF సినిమాల నుంచి ప్రేరణ పొంది తెరకెక్కించినట్టు అర్దమవుతోంది. ఇందులో శర్వానంద్ పాత్ర రెండు భిన్న కోణాల్లో సాగనుంది. ప్రశాంత్ పిళ్లై సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని... హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.